ఒమన్లో కాల్పులు..నలుగురు మృతి
- July 16, 2024
మస్కట్: ఒమన్లోని వాడి అల్ కబీర్లోని మసీదు సమీపంలో మంగళవారం జరిగిన కాల్పుల ఘటనలో కనీసం నలుగురు మరణించగా పలువురు గాయపడ్డారు. అధికారులు విడుదల చేసిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. తూర్పు మస్కట్లోని మసీదు పరిసరాల్లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. "వాడీ అల్ కబీర్ ప్రాంతంలోని మసీదు పరిసరాల్లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. అనేకమంది గాయపడ్డారు." అని ఓమానీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. కాల్పుల ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని, గాయపడిన బాధితులు త్వరగా కోలుకోవాలని పోలీసులు ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









