ఒమన్లో కాల్పులు..నలుగురు మృతి
- July 16, 2024
మస్కట్: ఒమన్లోని వాడి అల్ కబీర్లోని మసీదు సమీపంలో మంగళవారం జరిగిన కాల్పుల ఘటనలో కనీసం నలుగురు మరణించగా పలువురు గాయపడ్డారు. అధికారులు విడుదల చేసిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. తూర్పు మస్కట్లోని మసీదు పరిసరాల్లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. "వాడీ అల్ కబీర్ ప్రాంతంలోని మసీదు పరిసరాల్లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. అనేకమంది గాయపడ్డారు." అని ఓమానీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. కాల్పుల ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని, గాయపడిన బాధితులు త్వరగా కోలుకోవాలని పోలీసులు ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!
- అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు
- కువైట్ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సముదాయం పై డ్రోన్ దాడి
- తెలంగాణ ప్రజలకు అలెర్ట్..









