భారత్ ను కలవరపెడుతున్న చండీపురా వైరస్.. లక్షణాలు ఇవే?
- July 16, 2024
భారత్: గత మూడు సంవత్సరాల క్రితం కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం అతలాకుతులం చేసింది. ఈ వైరస్ కారణంగా లక్షల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాయి.
అయితే ఈ భయంకరమైన మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తరుణంలోనే మరో కొత్త వైరస్ వ్యాప్తి చెంది అందరిని భయాందోళనలకు గురిచేస్తుంది.
గుజరాత్ లో చండీపురా అనే కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ చిన్నపిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపడంతో కొద్ది రోజుల వ్యవధిలోనే 6 గురి పిల్లలు మరణించినట్టు వైద్యులు తెలిపారు.
వైద్యులు సమాచారం ప్రకారం ఈ వైరస్ మొదట జ్వరానికి కారణమవుతుందని తెలిపారు. ఇక ఈ వైరస్ ఈగలు దోమలు వంటి కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుందని వైద్యులు వెల్లడించారు.
ఈ వ్యాధి వ్యాప్తి చెందిన పిల్లల మెదడుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది మెదడు మొత్తం వాపు రావడమే కాకుండా రోజురోజుకు వారి పరిస్థితి మరింత క్షీణించి పోతుందని తెలిపారు. ఇలా ఈ వైరస్ వ్యాప్తి చెందితే తీవ్రమైనటువంటి జ్వరం తలనొప్పి వంటి లక్షణాలు కనబడతాయి. అయితే ఈ వైరస్ 1966వ సంవత్సరం మహారాష్ట్ర నాగపూర్ లో చండీపూర్ అనే గ్రామంలో మొదటిసారి బయటపడింది. 15 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి పిల్లలు ఈ వైరస్ బారిన పడి చనిపోవడంతో ఈ వైరస్ కి చండీపూర్ అనే పేరు వచ్చింది.
ఇక ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలి అంటే మన చుట్టూ పరిసర ప్రాంతాలలో దోమలు ఈగలు పెరగడానికి ఆస్కారం లేకుండా చూసుకోవాలి. నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి, అలాగే పూల కుండీలలో కూడా నీరు లేకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఈ వైరస్ ను అరికట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







