10 రోజుల్లో 33 హీట్ సంబంధిత కేసులు నమోదు

- July 17, 2024 , by Maagulf
10 రోజుల్లో 33 హీట్ సంబంధిత కేసులు నమోదు

కువైట్: హీట్ పీక్ పీరియడ్స్‌లో (ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు) ఎక్కువ సమయం ఎండలో ఉండవద్దని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించింది. మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్-సనద్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో ముఖ్యంగా హీట్ పీక్ పీరియడ్స్‌లో నేరుగా ఎండలో ఉండటం కారణంగా ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతుందని.. వడదెబ్బ,  హీట్ స్ట్రోక్, కండరాల సమస్యలు, నీరసం, కండరాల బలహీనత లాంటి సమస్యలు వస్తాయన్నారు.  అవసరమైతే తప్ప ఆ పీక్ పీరియడ్‌లో బయటకు వెళ్లకుండా ఉండాలని అల్-సనద్ ప్రతి ఒక్కరికి సూచించారు. జూలై మొదటి 10 రోజులలో దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులలో అధిక వేడి-సంబంధిత కేసులతో సంబంధం ఉన్న సుమారు 33 కేసులు నమోదు అయినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com