ఒమన్ తీరంలో 8మంది భారతీయులను రక్షించిన భారత యుద్ధనౌక

- July 18, 2024 , by Maagulf
ఒమన్ తీరంలో 8మంది భారతీయులను రక్షించిన భారత యుద్ధనౌక

మస్కట్: జూలై 15న ఒమన్ తీరంలో బోల్తా పడిన ఆయిల్ ట్యాంకర్ ప్రెస్టీజ్ ఫాల్కన్‌లోని తొమ్మిది మంది సిబ్బందిని రక్షించారు.  రెస్క్యూ ఆపరేషన్‌లో ఒక సిబ్బంది చనిపోయారని ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ బుధవారం తెలిపింది. భారత నౌకాదళం మిషన్ యుద్ధనౌక INS టెగ్‌ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటుంది.  మిగిలిన సిబ్బంది కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు.

జూలై 15న ఒమన్‌లోని రాస్ మద్రాకాకు ఆగ్నేయంగా 25 నాటికల్ మైళ్ల దూరంలో MV బోల్తా పడింది.  జూలై 16 నుండి ఒమన్ అధికారుల సమన్వయంతో సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్లు ప్రారంభం అయ్యాయి. MVలో 13 మంది భారతీయులు మరియు ముగ్గురు శ్రీలంక పౌరులు సహా మొత్తం 16 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com