హైతీ నుండి వెళ్తున్న బోటులో ఘోర అగ్ని ప్రమాదం

- July 20, 2024 , by Maagulf
హైతీ నుండి వెళ్తున్న బోటులో ఘోర అగ్ని ప్రమాదం

హైతీ: మూడు రోజుల క్రితం హైతీ నుంచి కాయ్ కోస్, టర్క్స్‌కు వెళ్తున్న బోటులో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. 80 మంది శరణార్థులతో వెళ్తున్న బోటులో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడం తో 40 మంది దుర్మరణం చెందారు. మరో 40 మందిని హైతీ తీర రక్షణ దళం కాపాడింది.

11 మందికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు.ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఐఓఎం చీఫ్ గ్రీగోర్ గుడ్‌స్టీన్ మాట్లాడుతూ.. హైతీలో సామాజిక ఆర్థిక పరిస్థితులు సంక్షోభంలో ఉన్నాయన్నారు. గత కొన్ని నెలలుగా నెలకొన్న తీవ్ర హింస వలసలకు కారణమవుతోందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com