‘షూట్‌ ఎట్‌ సైట్‌’ ఆదేశించిన బంగ్లాదేశ్‌ ప్రభుత్వం

- July 21, 2024 , by Maagulf
‘షూట్‌ ఎట్‌ సైట్‌’ ఆదేశించిన బంగ్లాదేశ్‌ ప్రభుత్వం

ఢాకా: బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్త రిజర్వేషన్‌ కోటాలను విధించడానికి నిరసనగా విద్యార్థులు గత కొన్ని రోజులుగా చేస్తున్న ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చడంతో కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే.తాజాగా కర్ఫ్యూని ధిక్కరించిన వారిపై ‘షూట్‌ ఎట్‌ సైట్‌’ ఆదేశాలు జారీ చేసింది.సైన్యాన్ని మోహరించింది.పోలీసుల కాల్పుల్లో ఇప్పటివరకు 115 మంది మరణించారు.

శనివారం మధ్యాహ్నం కొంత సేపు కర్ఫ్యూని సడలించింది.అయితే ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశించింది.సమావేశాలు, సభలపై నిషేధం విధించింది.దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను నిషేధించింది.దీంతో ఢాకా ట్రిబ్యూన్‌, డైలీ స్టార్‌తో సహా ప్రధాన వార్తాపత్రికలు తమ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఆప్‌ డేట్‌ చేయలేకపోయాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com