ఒలింపిక్ విలేజ్లో అడుగు పెట్టిన భారత్!
- July 21, 2024
పారిస్: పారిస్ ఒలింపిక్స్ 2024కు సమయం ఆసన్నమైంది. మరో 5 రోజుల్లో ఈ క్రీడల మహాసంగ్రామానికి తెరలేవనుంది. జూలై 26న ఈ మెగా ఈవెంట్ జరగనుండగా.. నిర్వాహకులు క్రీడా గ్రామాన్ని తెరిచి ఆయా దేశాల అథ్లెట్లకు స్వాగతం పలుకుతున్నారు. భారత్ కూడా ఒలింపిక్స్ విలేజ్లో అడుగుపెట్టింది.
దేశం నుంచి మొదటగా ఆర్చరీ, రోయింగ్ బృందాలు క్రీడా గ్రామాన్ని చేరుకున్నాయని ఈ ఒలింపిక్స్కు భారత చెఫ్ డి మిషన్గా వ్యవహరిస్తున్న దిగ్గజ షూటర్ గగన్ నారంగ్ తెలిపాడు. 'నేను గురువారం రాత్రి పారిస్ చేరుకున్నాను. భారత్ నుంచి ముందుగా ఆర్చరీ, రోయింగ్ బృందాలు శుక్రవారం ఒలింపిక్ విలేజ్లో అడుగుపెట్టాయి. ఇక్కడి వాతావరణానికి అథ్లెట్లు నెమ్మదిగా అలవాటుపడుతున్నారు.
పురుషుల హాకీ జట్టు కూడా క్రీడా గ్రామానికి రానుంది. భారత అథ్లెట్లు అంతా మంచి ఉత్సాహంతో ఉన్నారు. వచ్చి రాగానే పోటీల వేదికలో ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు. భారత అథ్లెట్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఒలింపిక్స్ కోసం చెఫ్ డి మిషన్గా పారిస్కు రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను.
భారత అథ్లెట్ల బృందంలో స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నిస్తా. మెడల్స్ సాధించే భారత అథ్లెట్ల సంఖ్య పెరగడం సంతోషంగా ఉంది.'అని గగన్ నారంగ్ చెప్పుకొచ్చాడు. ఈ ఒలింపిక్స్లో భారత్ నుంచి మొత్తం 117 మంది అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 20 ఈవెంట్స్లో పోటీపడనున్నారు.ఈ సారి భారత్ పతకాల సంఖ్యలో డబుల్ డిజిట్ సాధిస్తుందనే ఆశతో అభిమానులు ఉన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







