‘యానిమల్’ బ్యూటీ త్రిప్తిని టాలీవుడ్ వదిలేసిందా.?
- July 21, 2024
రణ్బీర్ కపూర్, రష్మిక మండన్నా జంటగా తెరకెక్కిన ‘యానిమల్’ సినిమా సెన్సేషనల్ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన త్రిప్తి దిమ్రి ఆ తర్వాత తెగ ట్రెండింగ్ అయ్యింది.
యూత్లో క్రేజీ ఇమేజ్ కొట్టేసింది. ఇంతలా ట్రెండింగ్ అయిన త్రిప్తికి టాలీవుడ్ మేకర్లు ఇంకేముంది బోలెడన్ని అవకాశాలిచ్చేస్తున్నారంటూ వేడి వేడిగా ప్రచారాలు, కథనాలు వినిపించాయ్.
కట్ చేస్తే, అలాంటిదేమీ లేదట. త్రిప్తికి టాలీవుడ్లో అవకాశాలేం లేవని తెలుస్తోంది. ఆ మధ్య మాస్ రాజా రవితేజ సినిమాలో హీరోయిన్ అంటూ ప్రచారం సాగింది. కానీ, అది కూడా కాదని తేలిపోయింది.
చూస్తుంటే, త్రిప్తి పాపని టాలీవుడ్ వదిలేసినట్లే కనిపిస్తోంది. అయితేనేం బాలీవుడ్లో త్రిప్తి హంగామా మామూలుగా లేదు. సూపర్ హిట్ సీక్వెల్స్ అయిన ‘భూల్ భులయ్యా 3’లో ఈ సారి త్రిప్తి హీరోయిన్గా ఎంపికైంది.
అలాగే, జాన్వీ కపూర్ డెబ్యూ మూవీ ‘ధడక్’కి సీక్వెల్గా రూపొందుతోన్న ‘ధడక్ 2’లో త్రిప్తి హీరోయిన్గా నటిస్తోంది. వెరీ లేటెస్ట్గా ఆనంద్ తివారీ దర్శకత్వంలో వచ్చిన ‘బ్యాడ్ న్యూస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
తాజా వార్తలు
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!







