సౌదీ అరేబియాలో ఫుడ్ ఫ్రాడ్.. ముగ్గురు ప్రవాసులే కారణం..!

- July 22, 2024 , by Maagulf
సౌదీ అరేబియాలో ఫుడ్ ఫ్రాడ్.. ముగ్గురు ప్రవాసులే కారణం..!

రియాద్: ముగ్గురు ప్రవాసులు ఆహార ఉత్పత్తులకు సంబంధించి మోసానికి పాల్పడ్డారని ఆర్థిక నేరాల ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఈ ఉత్పత్తులు గడువు ముగిసినవని, సరిగ్గా నిల్వ చేయనివి అని దర్యాప్తులో వెల్లడైందని పేర్కొంది. నిందితులు 55 టన్నులకు పైగా ఉన్న పౌల్ట్రీని ప్రదర్శించి, నిల్వ చేశారని, వాటిని తప్పుడు లేబుల్‌లతో తిరిగి ప్యాక్ చేసి, ఉత్పత్తి తేదీలలో మార్పులు చేసి విక్రయాలు చేస్తున్నారని ఆరోపించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని క్రిమినల్ కోర్టుకు తరలించామని తెలిపింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ మానవ ఆరోగ్యానికి హాని కలిగించే నేరపూరిత చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని, చట్టపరంగా భారీ జరిమానాలను విధించాలని కోరింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com