అశ్విన్ బాబు భారీగానే ప్లాన్ చేశాడుగా
- July 22, 2024
‘‘రాజుగారి గది’ సిరీస్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో అశ్విన్ బాబు. టీవీ యాంకర్ కమ్ ఫిలిం మేకర్ అయిన ఓంకార్కి సోదరుడైన అశ్విన్ బాబు కెరీర్లో ‘రాజు గారి గది’ సినిమాలు తప్ప చెప్పుకోదగ్గ సక్సెస్లేమీ లేవు.
‘రాజుగారి గది’ కోసం దెయ్యాల కాన్సెప్ట్ తీసుకుంటే, తాజాగా శివుడి నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు అశ్విన్ బాబు. అదే ‘శివం భజే’. సైలెంట్గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 1 ని రిలీజ్కి సిద్ధమవుతోంది.
అప్సర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో దిగంగన సూర్యవంశీ హీరోయిన్గా నటిస్తోంది. ఆల్రెడీ రిలీజ్ చేసిన టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
విజువల్స్ బాగున్నాయ్. క్వాలిటీ కూడా రిచ్గా కనిపిస్తోంది. పరమేశ్వరుడి రూపాన్ని రివీల్ చేయలేదు కానీ, డివైన్ వైబ్స్ స్క్రీన్పై అదిరిపోయేలా వుండబోతున్నాయని హింట్ ఇచ్చారు.
ఫుల్ ఆఫ్ యాక్షన్ మరియు ఆధ్యాత్మిక కళ కనిపిస్తోంది ఈ సినిమాలో. చూడాలి మరి, ఈ సినిమాతోనైనా అశ్విన్ బాబు బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







