శ్రీలంక చేరుకున్న టీమిండియా
- July 22, 2024
కొలంబో: టీమిండియా ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ తొలిసారిగా విలేకరుల సమావేశాన్ని ముగించుకొని ఇండియాతో శ్రీలంక బయలుదేరారు. సోమవారం (జూలై 22) టీమిండియా ముంబై నుంచి శ్రీలంక పర్యటనకు బయలుదేరింది.తాజాగా భారత ఆటగాళ్లు శ్రీలంక చేరుకున్నారు.
ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తో పాటు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్,హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, అర్షదీప్ సింగ్, లంక గడ్డపై అడుగుపెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
టీ20 జట్టు మాత్రమే శ్రీలంకకు బయలుదేరినట్టు కనిపిస్తుంది. టీ 20 సిరీస్ జూలై 27 నుంచి ప్రారంభమవుతుంది. వన్డే జట్టు త్వరలో లంకకు వెళ్తుంది.మూడు మ్యాచ్ల టీ20 సిరీస్తో భారత్, శ్రీలంక పర్యటన ప్రారంభం కానుంది. సిరీస్లో మొదటి టీ20 జూలై 27న ,రెండవ మ్యాచ్ జూలై 28,థర్డ్ మ్యాచ్ 30న జరుగుతాయి.టీ20 సిరీస్ అనంతరం ఆగస్టు 2,4,7 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు జరుగునున్నాయి.భారత కాలమానం ప్రకారం, టీ20లు రాత్రి 7:30 గంటలకు, వన్డేలు మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







