శ్రీలంక చేరుకున్న టీమిండియా
- July 22, 2024
కొలంబో: టీమిండియా ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ తొలిసారిగా విలేకరుల సమావేశాన్ని ముగించుకొని ఇండియాతో శ్రీలంక బయలుదేరారు. సోమవారం (జూలై 22) టీమిండియా ముంబై నుంచి శ్రీలంక పర్యటనకు బయలుదేరింది.తాజాగా భారత ఆటగాళ్లు శ్రీలంక చేరుకున్నారు.
ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తో పాటు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్,హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, అర్షదీప్ సింగ్, లంక గడ్డపై అడుగుపెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
టీ20 జట్టు మాత్రమే శ్రీలంకకు బయలుదేరినట్టు కనిపిస్తుంది. టీ 20 సిరీస్ జూలై 27 నుంచి ప్రారంభమవుతుంది. వన్డే జట్టు త్వరలో లంకకు వెళ్తుంది.మూడు మ్యాచ్ల టీ20 సిరీస్తో భారత్, శ్రీలంక పర్యటన ప్రారంభం కానుంది. సిరీస్లో మొదటి టీ20 జూలై 27న ,రెండవ మ్యాచ్ జూలై 28,థర్డ్ మ్యాచ్ 30న జరుగుతాయి.టీ20 సిరీస్ అనంతరం ఆగస్టు 2,4,7 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు జరుగునున్నాయి.భారత కాలమానం ప్రకారం, టీ20లు రాత్రి 7:30 గంటలకు, వన్డేలు మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
తాజా వార్తలు
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!









