ఘనంగా 'తానా' 20వ వేడుకలు
- July 04, 2015
డెట్రాయిట్ నుంచి సాక్షి ప్రతినిధి: నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (తానా) మహాసభల వేడుకలు గురువారం రాత్రి (భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం) ఘనంగా ప్రారంభమయ్యాయి. పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు వేడుకలకు హాజరయ్యారు. స్థానికంగా నూతన తానా భవనాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, ఆ రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు, పల్లె రఘునాథ్రెడ్డి, పరిటాల సునీత తదితర రాజకీయ ప్రముఖులు పాల్గొని వేడుకలను తిలకించారు. సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, నటులు వెంకటేశ్, అల్లరి నరేశ్, నవదీప్, నిఖిల్, తాప్సీ, రచయితలు సుద్దాల అశోక్తేజ, జొన్నవిత్తుల, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, యలమంచిలి శివాజీ, అట్లూరి సుబ్బారావు తదితరులు వేడుకలకు హాజరయ్యారు. తానా సభల సమన్వయకర్త నాదెళ్ల గంగాధర్, అధ్యక్షుడు నన్నపనేని మోహన్ అతిథులకు స్వాగతం పలికారు. సుద్దాల అశోక్తేజ, డా.పొదిలి ప్రసాద్, డా.గోపీచంద్, డా.ఎన్.ఎస్.రెడ్డి, ఆర్.శ్రీహరి, డా.కాకిరాల ప్రసాద్, డా.గంగా చౌదరి, డా.శివాజీరావు అవార్డులు అందుకున్నారు. .
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







