రమదాన్ నైట్ మార్కెట్ కు అరగంటలో 1000 మంది సందర్శకులు!
- July 04, 2015
ఈ గురువారం సాయంత్రం తెరువబడిన రమదాన్ నైట్ మార్కెట్ సందర్శకులతో కిటకిటలాడింది. పిల్లలను, పెద్దలను ఒకేవిధంగా ఆకర్షించే 300 రీటేల్ ఔట్లెట్లను కలిగిఉన్నదీనిని, కేవలం మొదటి అరగంట సమయంలో 1000 మంది వినియోగదారులు ముంచెత్తారు! మిర్రర్ మాన్, లివింగ్ స్ట్యాట్యూ, హాండ్ రైటింగ్ అనాలిసిస్ వంటి అనేక రకాల ఆకర్షణలతో, ఆడవారి కోసం హెన్నా మజ్లిస్ వంటివి, చిన్నారుల కోసం మెర్రీ లాటర్ అండ్ మూజిక్ చక్కని అటవిడుపులే కాకుండా, చవులూరించే 50 ఫుడ్ ఔట్లెట్లు కూడా రాత్రంతా సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. జువెల్లరీ, గార్మెంట్స్, కాస్మెటిక్స్, ఫర్నిచర్ వంటి షాపింగ్ ఆవన్యూ లలో అతి విస్తారమైన శ్రేణితో అలరిస్తూ సందర్శకుల బేరాలతో ప్రతిధ్వనిస్తోంది. ఇక్కడ కేవలం షాపింగ్ మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు వినోదాన్నందించడం ఈ పండుగ ప్రత్యేకత అని సుమనస ఎగ్జిబిషన్ ప్రెసిడెంట్ - సునీల్ జైశ్వాల్ విశ్లేషించారు. అంతే కాకుండా ఇక్కడ రీ సైకిల్ ఫర్నిచర్ మార్కెట్ లో, 100% రీ సైకిల్ చేయబడిన పేపర్ తో 20 cm నుండి 40 mt వరకు వ్యాప్తించే ల క్షణం గల పేపర్ ఫర్నిచర్, ఒక టన్ను వరకు బరువును తట్టుకోగలుగుతుంది; 6 నుండి 8 మంది కూర్చునేవిధంగా అనువుగా ఉంటుంది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







