సాఫ్ట్వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ సరఫరా చేసిన వ్యక్తి అరెస్ట్
- July 23, 2024
హైదరాబాద్: డెలివరీ బాయ్ ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని టీజీ న్యాబ్, మాదాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి 15 గ్రాముల ఎండీఎంఏ, 22.5 కేజీల గంజాయి, 491 గ్రాముల హ్యాష్ ఆయిల్, 71 నైట్రోజన్ ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
గచ్చిబౌలి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ డీసీపీ వినీత్ కేసు వివరాలను వెల్లడించారు. ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన షేక్ బిలాల్(28) ఇంటర్ చదివే సమయంలోనే గంజాయికి అలవాటు పడ్డాడు. కరోనా తర్వాత హైదరాబాద్ మాదాపూర్ ఇజ్జత్నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. జొమాటో డెలివరీ బాయ్గా పనిచేస్తూ పాత పరిచయాల నేపథ్యంలో అరకు నుంచి గంజాయి తెచ్చి దాదాపు 40.. 50 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు విక్రయిస్తున్నాడు.పక్కా సమాచారంతో నిందితుడి ఇంట్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడు భాను తేజ జైలులో ఉన్నాడని, అతన్ని కస్టడీకి తీసుకొని విచారిస్తామని డీసీపీ తెలిపారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







