బహ్రెయిన్ లోని ఎ-అలీ గ్రాండ్ మసీదులో ఉమ్మడి ప్రార్ధనలు
- July 04, 2015
అరబ్, ఇస్లామిక్ దేశాలకు వ్యతిరేకంగా వ్యూహరచన చేసేవారికి చెంపపెట్టులాగా బహ్రెయిన్ ప్రజలు నిలిచారని, ఇస్లామిక్ ఆఫైర్స్ మరియు ఎండోమెంట్స్ మినిస్టర్ షేక్ హలిద్ బిన్ అలీ అల్ ఖలీఫా ఉద్ఘాటించారు. అంతేకాకుండా బహ్రెయిన్ ఆధునికీకరణకు, సౌభాతృత్వానికి, ఇస్లామీయ ఐక్యతకు, దేశభక్తికి మారుపేరని ఆయన అన్నారు. బహ్రెయిన్ లోని ఎ-అలీ గ్రాండ్ మసీదు ఇమామ్ షేక్ నస్సెర్ ఖలాఫ్ అల్ అస్ఫూర్, ఇక్కడి రెండు ముస్లిం తెగల ప్రజలతో ఉమ్మడి ప్రార్ధనలు జరిపించి, తమ ప్రజలు కష్టసమయంలో కూడా అసమాన ఐక్యతకు ప్రతీకలని నిరూపించారన్నారు. బహ్రెయిన్ లోనున్న రెండు ముస్లిం తెగల వారు ఎ-అలీ గ్రాండ్ మసీదులో కలసి ప్రార్ధనలు చేయడం, టెర్రరిజానికి, విఛ్ఛిన్నకర శక్తులకు తమ మాతృ భూమి కోసం తాము క్లిష్ట సమయంలో మరింత ఒక్కతౌతామని తిరుగులేని జవాబునిచ్చినట్టైoదని తెలిపారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







