స్విట్జర్లాండ్‌కు భారతీయ బృందం...

- June 15, 2016 , by Maagulf
స్విట్జర్లాండ్‌కు భారతీయ బృందం...

 స్విట్జర్లాండ్‌లో నల్లధనం దాచుకున్న కుబేరుల వివరాలను తెలుసుకునేందుకు భారతీయ బృందం త్వరలో ఆ దేశంలో పర్యటించనుంది. అక్కడి బ్యాంకుల్లో భారతీయులు అక్రమంగా దాచుకున్న సొమ్ము వివరాలను ఆ బృందం బయటపెట్టనుంది. ఇటీవల స్విజ్ దేశాధ్యక్షుడు జోహన్న స్నీడర్ అమ్మాన్‌తో ప్రధాని మోదీ భేటీ అయిన తర్వాత ఈ అంశంపై నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2018 సంవత్సరం నుంచి నల్ల కుబేరుల వివరాలపై ఇరు దేశాలు సమాచారాన్ని పంచుకునేందుకు ఓ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోనున్నారు. బుధవారం నాడు స్విట్జర్లాండ్‌కు చెందిన అత్యున్నత స్థాయి ప్రతినిధులు భారతీయ ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో భేటీ అయ్యారు. బహుళ పన్ను విధానం, ఆర్థిక అంశాలపై ఆ బృందం చర్చలు నిర్వహించింది.రెవన్యూ కార్యదర్శి హస్‌ముక్ ఆదియా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌లతో స్విజ్ అధికారులు జాక్వస్ డీ వాటెల్లీలు సమావేశం అయ్యారు. ఈ ఏడాది చివరి లోగా ఇరు దేశాల మధ్య సమాచార పంపకంపై ఒప్పందం కుదిరే అవకాశాలున్నట్లు వాళ్లు తెలిపారు. ఒకసారి ఆ ఒప్పందం కుదిరితే, 2018 తర్వాత స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల అకౌంట్ల వివరాలు ఆటోమెటిక్‌గా తెలుస్తాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరోసారి రెండు దేశాల అధికారులు నల్లధనం అంశంపై భేటీ కానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com