అర్హత ఉన్న వారు పింఛను అందుకోవాలంటే సవాలక్ష నిబంధనలు..

- June 15, 2016 , by Maagulf
అర్హత ఉన్న వారు పింఛను అందుకోవాలంటే సవాలక్ష నిబంధనలు..

అర్హత ఉన్న వారు పింఛను అందుకోవాలంటే సవాలక్ష నిబంధనలు. వేలిముద్రలు మాసేవరకూ మిషన్‌పై నొక్కిస్తారు.. కాళ్లరిగేలా తిప్పిస్తారు.. నువ్వే ఆ మనిషివని గ్యారేంటి ఏంటంటూ ఆకార్డు ఈ కార్డులు చూపించమంటారు.. కానీ, ఒకామె దుబాయ్ వెళ్లిపోయి నాలుగు నెలలైనా ఆమెకు పింఛను ఆగలేదు. మనిషి ఇక్కడ లేకపోయినా ఆమె పేరిట మూడు నెలల పింఛను పంపిణీ చేసేశారు. ఎలా, అంటే.... మాత్రం తెల్లమొఖాలు.ఈ విచిత్ర ఘటన మండలంలోని వాదాలకుంట గ్రామంలో చోటు చేసుకుంది. మహాత్మాగాందీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2015-16కు సంబంధించి బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో బహిరంగ విచారణ చేపట్టారు. ఈ విచారణలో పై విషయం వెలుగుచూసి అంతా అవాక్కయ్యారు.దీంతో ఆ పింఛను సొమ్ము రికవరీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఇది ఇలా ఉండగా ఉపాధి నిధులు రూ.23, 237 దుర్వినియోగమైనట్టు ప్రిసైడింగ్ అధికారి అప్పారావు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com