లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో వయనాడ్ సహాయక చర్యల్లో మోహన్లాల్..
- August 03, 2024
కేరళ: కేరళ రాష్ట్రంలోని వయనాడ్లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ఎంతో మంది మృతి చెందడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్లాల్ ముందుకు వచ్చారు. ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ కూడా అయిన మోహన్లాల్ శనివారం ఆర్మీ యూనిఫాం ధరించి వయనాడ్కు చేరుకున్నారు.
మెప్పాడిలోని ఆర్మీ క్యాంపు వద్దకు చేరుకున్న నటుడు, అధికారులతో కొద్దిసేపు చర్చించి.. కొండచరియలు విరిగిపడిన ప్రాంతానికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆస్పత్రిలోచికిత్స పొందుతున్న బాధితులను మోహన్ లాల్ పరామర్శించనున్నారు. ఇప్పటికే ఆయన కేరళ సీఎం సహాయనిధికి రూ.25లక్షలు విరాళంగా అందించారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న వాలంటీర్లు, పోలీసులు, రెస్క్యూ టీమ్లు, ప్రభుత్వ అధికారుల కృషిని ఆయన ప్రశంసించారు.
మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డ్రోన్లు, రాడార్లు, మొబైల్ ఫోన్ల సిగ్నళ్ల ద్వారా ఎక్కడెక్కడ ఎవరు చిక్కుకుపోయారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వందలాది మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









