కన్వర్ యాత్రలో విషాదం..9 మంది భక్తులు మృతి
- August 05, 2024
పాట్నా: బీహార్లోని హాజీపూర్లో కావడి యాత్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.ఆదివారం అర్ధరాత్రి హాజీపూర్ సమీపంలోని సుల్తాన్పూర్ వద్ద కన్వర్ యాత్రికులు ప్రయాణిస్తున్న డీజే వాహనానికి హైటెన్షన్ వైర్ తగిలడంతో తొమ్మిది మంది మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. మృతుల్లో ఒక మైనర్ ఉన్నారు. కావడి యాత్రికులు పహెల్జా నుంచి గంగాజలాన్ని తీసుకుని సోన్పూర్లోని బాబా హరిహరనాథ్ ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. కన్వరియాలు ట్రాలీలో డీజేని తీసుకెళ్తున్నారని, దానికి 11 వేల వోల్టుల విద్యుత్ తీగ తగిలిందని స్థానిక ఎస్డీపీవో ఓంప్రకాశ్ తెలిపారు. దీంతో వారు విద్యుదాఘాతానికి గురయ్యారని చెప్పారు. ఘటనా స్థలంలోనే ఎనిమిది మంది మరణించారని, మరొకరు దవాఖానలో చనిపోయారని వెల్లడించారు.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









