‘జాతి రత్నాలు’ హీరో నవీన్ పోలిశెట్టికి ఏమైంది.?
- August 05, 2024
‘జాతి రత్నాలు’ సినిమాతో సంచలన విజయం అందుకున్న యంగ్ స్టర్ నవీన్ పోలిశెట్టి. తనదైన డిఫరెంట్ ఆటిట్యూడ్తో స్క్కీన్ మీద కనిపించే నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు.?
అదేంటీ.! మొన్ననే కదా.! ఏకంగా స్వీటీ అనుష్కతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా చేశాడు. తదుపరి ప్రాజెక్టులతో బిజీగా వుండి వుంటాడు.. అనుకోవచ్చు.
కానీ, కాదు ప్రస్తుతం ఈ హీరో రెస్ట్ తీసుకుంటున్నాడు. కాదు కాదు తీసుకోవల్సి వచ్చింది. అందుకు కారణం రీసెంట్గా జరిగిన ఓ చిన్న యాక్సిడెంట్ కారణంగా చేతికి ఫ్రాక్చర్ అయ్యింది.
చిన్న ఫ్రాక్చరేం కాదండోయ్. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయంటున్నారు. సో, చేతికి కట్టు వేసి కొన్ని నెలలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం చూచాయగా బయటికి రావడంతో ‘ఇంకేముంది.! మనోడు సినిమాలు చేయడానికి పనికి రాడు.. కెరీర్ ఖతమ్..’ అయిపోయింది.. అంటూ ప్రచారం మొదలైంది.
అందుకు ఆయన సోషల్ మీడియా ద్వారా రెస్పాండ్ అయిన విధానం అందర్నీ ఎంటర్టైన్ చేస్తోంది. తన ప్రాబ్లెమ్ని ఓ ఫన్నీ వీడియో ద్వారా అందరికీ కన్వే చేశాడు.
అయితే, అందులో ఫన్నీ కాదండోయ్.. ఆయన ఎమోషన్ కూడా దాగుంది. ఎంతైనా నటుడు కదా.! ఎంత బాధున్నా నవ్వుతూనే వుండాలి. నవ్విస్తూనే వుండాలి అదే చేశాడు నవీన్ పోలిశెట్టి. హ్యాట్సాప్ టు హిమ్. తొందరగా నవీన్ పోలిశెట్టి రికవర్ అయ్యి మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని కోరుకుందాం.
తాజా వార్తలు
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఎప్పుడొస్తాయి? పేరెంట్స్ లో ఆందోళనలు..!!
- బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ నేతృత్వం..!!
- 77 శాతానికి కార్మికులలో ప్రమాద అవగాహన..!!
- విమానయాన సంస్థల పై ప్రయాణికుల ఫిర్యాదుల పై విచారణ..!!
- IRGC కి సహకారం..ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- 23 మంది అక్రమ చోరబాటుకు సహకారం..ఇద్దరి అరెస్టు..!!
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!









