‘జాతి రత్నాలు’ హీరో నవీన్ పోలిశెట్టికి ఏమైంది.?
- August 05, 2024
‘జాతి రత్నాలు’ సినిమాతో సంచలన విజయం అందుకున్న యంగ్ స్టర్ నవీన్ పోలిశెట్టి. తనదైన డిఫరెంట్ ఆటిట్యూడ్తో స్క్కీన్ మీద కనిపించే నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు.?
అదేంటీ.! మొన్ననే కదా.! ఏకంగా స్వీటీ అనుష్కతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా చేశాడు. తదుపరి ప్రాజెక్టులతో బిజీగా వుండి వుంటాడు.. అనుకోవచ్చు.
కానీ, కాదు ప్రస్తుతం ఈ హీరో రెస్ట్ తీసుకుంటున్నాడు. కాదు కాదు తీసుకోవల్సి వచ్చింది. అందుకు కారణం రీసెంట్గా జరిగిన ఓ చిన్న యాక్సిడెంట్ కారణంగా చేతికి ఫ్రాక్చర్ అయ్యింది.
చిన్న ఫ్రాక్చరేం కాదండోయ్. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయంటున్నారు. సో, చేతికి కట్టు వేసి కొన్ని నెలలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం చూచాయగా బయటికి రావడంతో ‘ఇంకేముంది.! మనోడు సినిమాలు చేయడానికి పనికి రాడు.. కెరీర్ ఖతమ్..’ అయిపోయింది.. అంటూ ప్రచారం మొదలైంది.
అందుకు ఆయన సోషల్ మీడియా ద్వారా రెస్పాండ్ అయిన విధానం అందర్నీ ఎంటర్టైన్ చేస్తోంది. తన ప్రాబ్లెమ్ని ఓ ఫన్నీ వీడియో ద్వారా అందరికీ కన్వే చేశాడు.
అయితే, అందులో ఫన్నీ కాదండోయ్.. ఆయన ఎమోషన్ కూడా దాగుంది. ఎంతైనా నటుడు కదా.! ఎంత బాధున్నా నవ్వుతూనే వుండాలి. నవ్విస్తూనే వుండాలి అదే చేశాడు నవీన్ పోలిశెట్టి. హ్యాట్సాప్ టు హిమ్. తొందరగా నవీన్ పోలిశెట్టి రికవర్ అయ్యి మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని కోరుకుందాం.
తాజా వార్తలు
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ







