తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్‌ మహీంద్రా

- August 05, 2024 , by Maagulf
తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్‌ మహీంద్రా

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్స్‌ అధినేత ఆనంద్ మహీంద్ర వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణ స్కిల్‌ యూనివర్సిటీకి చైర్మన్‌గా వ్యవహరించాలని తాను కోరడంతో ఆనంద్ మహీంద్రా అంగీకరించారని.. కొద్ది రోజుల్లోనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు.

తెలంగాణ యువతను ప్రపంచంలోనే ఉత్తమ నైపుణ్యం కలిగినవారిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైన తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి అంతర్జాతీయంగా పేరున్న ప్రముఖుడినే అధినేతగా నియమిస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆనంద్ మహీంద్రా ఇటీవల హైదరాబాద్‌లో సీఎంతో సమావేశమైన సందర్భంలోనూ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ పై చర్చలు జరిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com