తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్రా
- August 05, 2024
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్స్ అధినేత ఆనంద్ మహీంద్ర వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా వ్యవహరించాలని తాను కోరడంతో ఆనంద్ మహీంద్రా అంగీకరించారని.. కొద్ది రోజుల్లోనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు.
తెలంగాణ యువతను ప్రపంచంలోనే ఉత్తమ నైపుణ్యం కలిగినవారిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైన తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి అంతర్జాతీయంగా పేరున్న ప్రముఖుడినే అధినేతగా నియమిస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆనంద్ మహీంద్రా ఇటీవల హైదరాబాద్లో సీఎంతో సమావేశమైన సందర్భంలోనూ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ పై చర్చలు జరిపారు.
తాజా వార్తలు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా