యూఏఈలోని బంగ్లాదేశీయులకు హెచ్చరికలు జారీ..!
- August 06, 2024
యూఏఈ: బంగ్లాదేశ్ మిషన్లు యూఏఈలోని పౌరులకు "అత్యంత సంయమనం" మరియు స్థానిక చట్టాలకు కట్టుబడి ఉండాలని సూచించాయి. స్థానిక చట్టాలు మరియు నిబంధనల గురించి స్వదేశీయులకు మార్గనిర్దేశం చేసేందుకు అబుదాబిలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం, దుబాయ్లోని కాన్సులేట్-జనరల్ అవగాహన ప్రచారంలో భాగంగా ఈ అలెర్ట్ జారీ చేసింది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం నాడు ఆమె నివాస భవనంపై నిరసనకారులు దాడి చేయడంతో రాజీనామా చేశారు. ఆమె భారతదేశంలో తలదాచుకున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఘర్షణలలో దాదాపు 100 మంది వరకు చనిపోయారు.
యూఏఈలో నివసిస్తున్న ప్రవాస బంగ్లాదేశీయులందరూ అత్యంత సంయమనం పాటించాలని, శాంతియుతంగా మరియు సామరస్యపూర్వకంగా సహజీవనం చేయాలని, నిబంధనలకు కట్టుబడి ఉండాలని బంగ్లాదేశ్ మిషన్లు ఒక ప్రకటనలో తెలిపాయి.
గత నెలలో హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూఏఈ వీధుల్లోకి వచ్చినప్పుడు కొంతమంది బంగ్లాదేశీయులు స్థానిక చట్టాన్ని ఉల్లంఘించారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించి ర్యాలీలో పాల్గొన్నందుకు మరో 53 మందికి కోర్టు 10 ఏళ్లు, ఒక నిందితుడికి 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఒక మిలియన్ కంటే ఎక్కువ బంగ్లాదేశ్ పౌరులు ఇక్కడ నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..