కేరళ చేరుకున్న ప్రధాని మోడీ
- August 10, 2024
తిరువనంతపురం: కేరళలోని కన్నురు విమానాశ్రయానికి ప్రధాని మోడీ చేరుకున్నారు. ఆ రాష్ట్ర సీఎం విజయన్తో పాటు గవర్నర్ ఆరిఫ్ ఖాన్ ఆయనకు స్వాగతం పలికారు. ప్రధాని మోడీ మరికాసేపట్లో వయనాడ్లో కొండచరియల వల్ల కొట్టుకుపోయిన ప్రదేశంలో పర్యటించనున్నారు. వయనాడ్లో తీవ్రంగా నష్టపోవడం వల్ల.. రిహాబలిటేషన్ కోసం రెండు వందల కోట్లు ఇవ్వాలంటూ కేంద్రాన్ని రాష్ట్ర సర్కారు కోరింది. కొండచరియల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో.. హెలికాప్టర్ ద్వారా ప్రధాని మోదీ ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి సురేశ్ గోపి ఉంటారు. తాజాగా జరిగిన వయనాడ్ విలయంలో సుమారు 226 మంది మరణించారు. ఇంకా ఆచూకీ లేని వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!
- అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు









