వరుణ్‌ తేజ్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ...

- June 16, 2016 , by Maagulf
వరుణ్‌ తేజ్‌  శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ...

వరుణ్‌ తేజ్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. గతేడాది విడుదలైన మలయాళ చిత్రం 'ప్రేమమ్‌'తో ప్రేక్షకులను అలరించిన కథానాయిక సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, 'అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథ నేపథ్యంలో మా శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. దర్శకుడు శేఖర్‌ కమ్ముల అద్భుతమైన స్టోరీ టెల్లర్‌. వరుణ్‌తేజ్‌ ఇప్పటికే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జులై 25న ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించి, ఆగస్టు చివరికి తెలంగాణ షెడ్యూల్‌ మొత్తం పూర్తి చేసుకుని, ఆక్టోబర్‌లో అమెరికాలో షూటింగ్‌ జరుపనున్నాం.
దీంతో షూటింగ్‌ పూర్తి అవుతుంది. చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఈ చిత్రానికి కెమెరా: విజరు కుమార్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌. ఈ చిత్రానికి సంబంధించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాను' అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com