వరుణ్ తేజ్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ...
- June 16, 2016
వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. గతేడాది విడుదలైన మలయాళ చిత్రం 'ప్రేమమ్'తో ప్రేక్షకులను అలరించిన కథానాయిక సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేశారు. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, 'అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథ నేపథ్యంలో మా శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. దర్శకుడు శేఖర్ కమ్ముల అద్భుతమైన స్టోరీ టెల్లర్. వరుణ్తేజ్ ఇప్పటికే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జులై 25న ఈ చిత్రం షూటింగ్ను ప్రారంభించి, ఆగస్టు చివరికి తెలంగాణ షెడ్యూల్ మొత్తం పూర్తి చేసుకుని, ఆక్టోబర్లో అమెరికాలో షూటింగ్ జరుపనున్నాం.
దీంతో షూటింగ్ పూర్తి అవుతుంది. చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రానికి కెమెరా: విజరు కుమార్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్. ఈ చిత్రానికి సంబంధించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాను' అని అన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







