వినేశ్ ఫొగాట్కు ఢిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం..
- August 17, 2024
న్యూ ఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ భారత్ చేరుకున్నారు. పారిస్ నుంచి బయలుదేరిన ఆమె శనివారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంకు చేరుకున్నారు. అప్పటికే అక్కడకు చేరుకున్న వినేశ్ ఫొగాట్ సన్నిహితులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారత ఒలింపిక్ పతక విజేతలు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ కూడా ఉన్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులను, తన సన్నిహితులను చూసి వినేశ్ ఫొగాట్ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. దీంతో ఆమెను కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా, రెజర్లు సాక్షి మాలిక్, భజరంగ్ పునియా, తదితరులు దగ్గరకు తీసుకొని ఓదార్చారు. విమానాశ్రయం బయటకు డప్పు నృత్యాలతో అభిమానులు వినేశ్ పొగ్రాట్ కు పెద్దుత్తున స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సాక్షి మాలిక్ మాట్లాడుతూ.. దేశంకోసం ఆమె ఏం చేసిందనేది ప్రతి ఒక్కరికీ తెలుసు. చాలా తక్కువ మంది మాత్రమే చేయగలరు. ఆమె ఈ ప్రశంసలు, గౌరవానికి అర్హురాలేనని అన్నారు. వినేశ్ ఫొగాట్ మాట్లాడుతూ… నాదేశ ప్రజల నుంచి నాకు లభించిన ఈ ప్రేమ, గౌరవానికి నేను కృతజ్ఞతురాలినని పేర్కొన్నారు. వినేశ్ తన స్వగ్రామమైన చర్కీదాద్రీకి వాహనాలపై ర్యాలీగా వెళ్లారు. పలువురు జాతీయ జెండాలను చేతభూమి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం స్వగ్రామంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది.
పారిస్ ఒలింపిక్స్ ఫైనల్ కు చేరిన వినేశ్.. 100 గ్రాములు అదనపు బరువు కారణంగా అనర్హతకు గురైన విషయం తెలిసిందే. కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)లో అప్పీలు చేసినా సానుకూలంగా ఫలితం దక్కలేదు. ఆమె విజ్ఞప్తిని కాస్ కొట్టివేసింది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









