వినేశ్ ఫొగాట్కు ఢిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం..
- August 17, 2024
న్యూ ఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ భారత్ చేరుకున్నారు. పారిస్ నుంచి బయలుదేరిన ఆమె శనివారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంకు చేరుకున్నారు. అప్పటికే అక్కడకు చేరుకున్న వినేశ్ ఫొగాట్ సన్నిహితులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారత ఒలింపిక్ పతక విజేతలు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ కూడా ఉన్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులను, తన సన్నిహితులను చూసి వినేశ్ ఫొగాట్ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. దీంతో ఆమెను కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా, రెజర్లు సాక్షి మాలిక్, భజరంగ్ పునియా, తదితరులు దగ్గరకు తీసుకొని ఓదార్చారు. విమానాశ్రయం బయటకు డప్పు నృత్యాలతో అభిమానులు వినేశ్ పొగ్రాట్ కు పెద్దుత్తున స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సాక్షి మాలిక్ మాట్లాడుతూ.. దేశంకోసం ఆమె ఏం చేసిందనేది ప్రతి ఒక్కరికీ తెలుసు. చాలా తక్కువ మంది మాత్రమే చేయగలరు. ఆమె ఈ ప్రశంసలు, గౌరవానికి అర్హురాలేనని అన్నారు. వినేశ్ ఫొగాట్ మాట్లాడుతూ… నాదేశ ప్రజల నుంచి నాకు లభించిన ఈ ప్రేమ, గౌరవానికి నేను కృతజ్ఞతురాలినని పేర్కొన్నారు. వినేశ్ తన స్వగ్రామమైన చర్కీదాద్రీకి వాహనాలపై ర్యాలీగా వెళ్లారు. పలువురు జాతీయ జెండాలను చేతభూమి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం స్వగ్రామంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది.
పారిస్ ఒలింపిక్స్ ఫైనల్ కు చేరిన వినేశ్.. 100 గ్రాములు అదనపు బరువు కారణంగా అనర్హతకు గురైన విషయం తెలిసిందే. కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)లో అప్పీలు చేసినా సానుకూలంగా ఫలితం దక్కలేదు. ఆమె విజ్ఞప్తిని కాస్ కొట్టివేసింది.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







