ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..
- August 18, 2024
న్యూ ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ముందుగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం అయ్యారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అమిత్ షాతో సీఎం చంద్రబాబు సుమారు గంటన్నర పాటు సమావేశం అయ్యారు. అమిత్ షా, చంద్రబాబుల సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఉన్నారు. అమిత్ షా, నడ్డాతో భేటీలో రాజకీయ అంశాల గురించి చంద్రబాబు చర్చించినట్లు సమాచారం.
అటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో జరిగిన భేటీలో ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి కూడా పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. అమరావతి పునర్ నిర్మాణం, పోలవరం నిర్మాణానికి కేంద్రం సహకారం కోరారు చంద్రబాబు. రాష్ట్రాభివృద్ధికి ఇస్తామని ప్రకటించిన నిధుల గురించి ఆయన వాకబు చేశారు. వెంటనే నిధులు విడుదల చేయాలని కేంద్ర పెద్దలను కోరారు సీఎం చంద్రబాబు. వెనుకబడిన జిల్లాలకు ఇస్తామన్న నిధులు ఇవ్వాలని, రుణాలు రీషెడ్యూల్ చేయాలని కేంద్ర పెద్దలకు విన్నవించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
తాజా వార్తలు
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్









