శివాజీ–లయ జంటగా కొత్త సినిమా..
- August 18, 2024
హైదరాబాద్: గతంలో శివాజీ–లయ కలిసి చేసిన ‘మిస్సమ్మ’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘అదిరిందయ్యా చంద్రం’.. సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఈ ఇద్దరు కూడా కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. శివాజీ ఆల్రెడీ కంబ్యాక్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నారు. లయ కూడా ఇటీవలే కంబ్యాక్ ఇచ్చి వరుస ఆఫర్స్ దక్కించుకుంటుంది.
ఒకప్పుడు హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న శివాజీ – లయ ఇప్పుడు మళ్ళీ కలిసి నటించబోతున్నారు. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శివాజీ లయ జంటగా కొత్త సినిమా నేడు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి శివాజీనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగగా నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టగా, శివాజీ కుమారుడు రిక్కీ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, దిల్ రాజు, దర్శకుడు బోయపాటి శ్రీను చేతుల మీదుగా స్క్రిప్ట్ ని అందుకోగా, బోయపాటి శ్రీను ఫస్ట్ డైరెక్షన్ చేసారు.
ఇక ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 20 నుంచి మొదలు కానుంది. ఒకప్పటి సూపర్ హిట్ పెయిర్ శివాజీ–లయ మళ్ళీ కలిసి వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









