సాఫ్ట్వేర్ జాబ్ పేరుతో ఘరానా మోసం
- August 18, 2024
హైదరాబాద్: హైదరాబాద్ మాదాపూర్ లో మరో సాఫ్ట్ వేర్ కన్సల్టెన్సీ కంపెనీ బోర్డు తిప్పేసింది. అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్ లో ఉన్న ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ కంపెనీ పెద్ద సంఖ్యలో నిరుద్యోగులను మోసం చేసింది. ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి కార్యాలయానికి తాళాలు వేసింది.
అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్ లో ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ పేరుతో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఏర్పాటైంది. ఈ కంపెనీ దాదాపు 600 మంది ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడలో కేంద్రాలు ఏర్పాటు చేసి సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన నిరుద్యోగులు ట్రైనింగ్, జాబ్ కోసం ఒక్కొక్కరు రూ.1.50 లక్షలు కట్టారు. కొన్ని రోజులు వారికి మాదాపూర్ లో ట్రైనింగ్ ఇస్తున్నట్లు నటించారు. మొత్తం 10 కోట్ల రూపాయలు వసూలు కాగానే రాత్రికి రాత్రి బోర్డు తిప్పేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









