సాఫ్ట్వేర్ జాబ్ పేరుతో ఘరానా మోసం
- August 18, 2024
హైదరాబాద్: హైదరాబాద్ మాదాపూర్ లో మరో సాఫ్ట్ వేర్ కన్సల్టెన్సీ కంపెనీ బోర్డు తిప్పేసింది. అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్ లో ఉన్న ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ కంపెనీ పెద్ద సంఖ్యలో నిరుద్యోగులను మోసం చేసింది. ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి కార్యాలయానికి తాళాలు వేసింది.
అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్ లో ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ పేరుతో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఏర్పాటైంది. ఈ కంపెనీ దాదాపు 600 మంది ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడలో కేంద్రాలు ఏర్పాటు చేసి సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన నిరుద్యోగులు ట్రైనింగ్, జాబ్ కోసం ఒక్కొక్కరు రూ.1.50 లక్షలు కట్టారు. కొన్ని రోజులు వారికి మాదాపూర్ లో ట్రైనింగ్ ఇస్తున్నట్లు నటించారు. మొత్తం 10 కోట్ల రూపాయలు వసూలు కాగానే రాత్రికి రాత్రి బోర్డు తిప్పేశారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







