తెలంగాణ: గంజాయి చాక్లెట్లకు అడ్డాగా దుకాణాలు
- August 19, 2024
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అనే పదాలు వినిపించొద్దని.. వాటిపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో రేవంత్ సర్కారు సీరియస్ గా ఉండటంతో పాటు వాటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో గంజాయి, డ్రగ్స్ సప్లయ్ కు తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరో అధికారులు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నారు. అయితే, సిటీ శివార్లలోని కిరాణా షాపుల్లో విచ్చలవిడిగా గంజాయి చాక్లెట్లు అమ్మకాలు జరగుతుండటం కలకలం రేపుతోంది. ఇటీవల కొంతకాలంగా పోలీసులు జరుపుతున్న దాడుల్లో భారీగా గంజాయి చాక్లెట్లు పట్టుబడుతున్నాయి. కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ పరిధి జగద్గిరిగుట్టలో గత నెల పెద్ద ఎత్తున గంజాయి చాక్లెట్లు దొరకడం కలకలం రేపింది.ఓ కిరాణా షాప్లో ఈ గంజాయి చాక్లెట్లను పోలీసులు పట్టుకున్నారు. వాటిని సీజ్ చేశారు. సుమారు తొమ్మిదిన్నర కేజీల బరువు ఉండే చాక్లెట్ పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కిరాణా షాప్ను నిర్వహిస్తోన్న ఓ మహిళను అరెస్ట్ చేశారు. అయితే, కిరాణా షాపుల్లో కూడా గంజాయి దొరుకుతోందని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలంటూ గత నెల 1న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద.. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కుత్బుల్లాపూర్ శివార్లలో ఇంజినీరింగ్, ఫార్మా, మెడికల్, జూనియర్, డిగ్రీ కాలేజీలు ఎక్కువగా ఉన్నాయని.. ఆ స్టూడెంట్లను లక్ష్యంగా చేసుకుని గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!









