భారత ప్రవాసులకు తక్కువకే విమాన ఛార్జీలు..!
- August 20, 2024
యూఏఈ: ఎమిరేట్స్ లో ఉన్న ఒక భారతీయ వ్యాపార సమూహం నివాసితులకు తక్కువ ధరకే విమాన టిక్కెట్లను అందజేస్తుంది. ఈ మేరకు ఒక విమానయాన సంస్థను ప్రారంభించనున్నారు. మూడు దశాబ్దాలకు పైగా ట్రావెల్ పరిశ్రమలో పనిచేస్తున్న అల్హింద్ గ్రూప్, భారతదేశంలో తన దేశీయ విమానయాన సంస్థను ప్రారంభించడానికి అవసరమైన తప్పనిసరి క్లియరెన్స్ను తాజాగా పొందింది. అనుమతులు పొందే చివరి దశలో ఉన్నామని గ్రూప్ చైర్మన్ మహ్మద్ హరీస్ చెప్పారు. “గత వారం, మేము కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (CIAL)లో అధికారులతో సమావేశమయ్యాము. మేము విమానాశ్రయంలో ల్యాండింగ్ అనుమతి కోసం అవసరమైన అన్ని పత్రాలను సమర్పించాము. ”అని వివరించారు. ఎయిర్లైన్ను ప్రారంభించడానికి తాము ఇంతకు ముందు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) అందుకున్నామని, జనవరి 2025 నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని తాము ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. అల్హింద్ ఎయిర్లైన్ మూడు ATR-72 టర్బోప్రాప్ విమానాలతో ప్రారంభమవుతుందన్నారు. ప్రారంభంలో కేవలం భారతీయ నగరాలకు మాత్రమే సేవలందిస్తున్న సంస్థ వేగంగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపారు. తాము మూడు విమానాలతో ప్రారంభిస్తామని, తమకు 20 విమానాలు వచ్చిన వెంటనే అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభిస్తామన్నారు. తమ మొదటి గమ్యం యూఏఈ అవుతుందని పేర్కొన్నారు. ఇక్కడ ఉండే భారత నివాసితులకు సేవలందించేందుకు మా టిక్కెట్ ధరలను మార్కెట్లో అతి తక్కువ ధరల్లో అందుబాటులో ఉంచాలని తాము లక్ష్యంగా పెట్టుకుంటామన్నారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు