సిబిఐ కోర్టులో వైఎస్‌ జగన్‌, విజయసాయి రెడ్డి పిటిషన్లు

- August 20, 2024 , by Maagulf
సిబిఐ కోర్టులో వైఎస్‌ జగన్‌, విజయసాయి రెడ్డి పిటిషన్లు

విజయవాడ: వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ఎంపి విజయసాయి రెడ్డిలు సిబిఐ కోర్టును ఆశ్రయించారు. వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో యూరప్‌ వెళ్లేందుకు అనుమతివ్వాలన్న విజయసాయిరెడ్డి పిటిషన్‌పై వాదనలు పూర్తి కాగా, ఈ నెల 30కి తీర్పును వాయిదా వేశారు. సెప్టెంబర్‌లో లండన్‌ వెళ్లేందుకు అనుమతివ్వాలన్న జగన్‌ పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేసేందుకు సిబిఐ సమయం కోరడంతో తదుపరి విచారణను బుధవారానికి కోర్టు వాయిదా వేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com