యూఏఈ వేదికగా మహిళల టి20 ప్రపంచకప్
- August 20, 2024
యూఏఈ: 2024 మహిళల టి20 ప్రపంచకప్ టోర్నమెంట్ యూఏఈ వేదికగా జరగనుంది.ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘బంగ్లాదేశ్ క్రికెట్బోర్డు(BCB) మెగా ఈవెంట్కు ఆతిథ్యమివ్వాల్సి ఉండగా..ఆతిథ్యంపై వెనక్కి తగ్గడం సిగ్గుచేటని ఐసిసి ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డిన్ ఆ ప్రకటనలో వెల్లడించారు.షెడ్యూల్ ప్రకారం 9వ ఎడిషన్ టి20 మహిళల ప్రపంచకప్ బంగ్లాదేశ్లో జరగాల్సి ఉండగా.. అక్కడ నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో ఐసిసి తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.టి20 మహిళల ప్రపంచకప్ మార్పుకు తొలుత శ్రీలంక, భారత్లను నిర్వహించమని కోరినా..ఆ రెండు దేశాలు సుముఖంగా లేకపోవడంతో ఐసిసి తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3నుంచి 20వరకు యూఏఈ వేదికగా ఈ టోర్నమెంట్ జరగనుంది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









