యూఏఈ వేదికగా మహిళల టి20 ప్రపంచకప్
- August 20, 2024
యూఏఈ: 2024 మహిళల టి20 ప్రపంచకప్ టోర్నమెంట్ యూఏఈ వేదికగా జరగనుంది.ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘బంగ్లాదేశ్ క్రికెట్బోర్డు(BCB) మెగా ఈవెంట్కు ఆతిథ్యమివ్వాల్సి ఉండగా..ఆతిథ్యంపై వెనక్కి తగ్గడం సిగ్గుచేటని ఐసిసి ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డిన్ ఆ ప్రకటనలో వెల్లడించారు.షెడ్యూల్ ప్రకారం 9వ ఎడిషన్ టి20 మహిళల ప్రపంచకప్ బంగ్లాదేశ్లో జరగాల్సి ఉండగా.. అక్కడ నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో ఐసిసి తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.టి20 మహిళల ప్రపంచకప్ మార్పుకు తొలుత శ్రీలంక, భారత్లను నిర్వహించమని కోరినా..ఆ రెండు దేశాలు సుముఖంగా లేకపోవడంతో ఐసిసి తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3నుంచి 20వరకు యూఏఈ వేదికగా ఈ టోర్నమెంట్ జరగనుంది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు