పోలాండ్ చేరుకున్న ప్రధాని మోడీ...
- August 21, 2024
ప్రధాని మోడీ రెండు విదేశీ పర్యటనల్లో భాగంగా బుధవారం పోలాండ్ చేరుకున్నారు. అక్కడ ఘన స్వాగతం లభించింది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో మోడీకి స్వాగతం పలికారు.
ఈ పర్యటన భారతదేశం-పోలాండ్ స్నేహానికి ఊపందుకుంటుందని… ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని మోడీ ఎక్స్ ట్విట్టర్లో పేర్కొన్నారు. భారత్, పోలెండ్ల మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోడీ అక్కడ పర్యటిస్తున్నారు. అయితే గత 45 ఏళ్లలో భారత ప్రధాని పోలెండ్లో పర్యటించడం ఇదే తొలిసారి. చివరిసారిగా 1979లో నాటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్ పోలెండ్ను సందర్శించారు.
గురువారం పోలాండ్ నుంచి ఉక్రెయిన్కు వెళ్లనున్నారు. రైల్లో 10 గంటలు ప్రయాణం చేసి మోడీ కీవ్ చేరుకుంటారు. దాదాపు 7 గంటల పాటు అక్కడ గడుపుతారు. ఇరు దేశాల సంబంధాలపై చర్చించనున్నారు. రష్యాతో యుద్ధం తర్వాత మోడీ ఉక్రెయిన్లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమై తిరిగి మళ్లీ రైలు మార్గంలోనే పోలెండ్ చేరుకుంటారు. అనంతరం పర్యటన ముగించుకుని భారత్కు తిరిగొస్తారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









