తిరుమలలో నకిలీ టికెట్ల కలకలం..
- August 23, 2024
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్ని జాగ్రత్తల చెప్పినా శ్రీవారి భక్తుల మోసాల బారిన పడుతూనే ఉన్నారు. భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు సొమ్ములు చేసుకుంటున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన నలుగురు భక్తుల మోసగాళ్ల బారిన పడ్డారు. నకిలీ టెకెట్లతో స్వామివారి కళ్యాణోత్సవానికి వచ్చిన వీరిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించడంతో ఈ మోసం వెలుగు చూసింది. ఇంటర్నెట్ నిర్వాహకుడి నుంచి శ్రీవారి కళ్యాణోత్సవం టికెట్లు కొనుగోలు చేసినట్టు భక్తులు తెలిపారు. దీంతో తమిళనాడు వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు అన్నాదురైపై పోలీసులకు విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు.
అన్నాదురై ఆన్లైన్లో నకిలీ వివరాలతో టికెట్లు తీసినట్టు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. పాస్పోర్టులోని చివరి నంబర్లను మార్చేసి శ్రీవారి కళ్యాణోత్సవం టికెట్లు బుక్ చేసినట్టు కనుగొన్నారు. ఈ టికెట్లను ఎక్కువ రేటుకు భక్తులకు విక్రయించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.
శ్రీవారి దర్శనం టికెట్లు, ఆర్జిత సేవ టికెట్లకు దళారీలను ఆశ్రయించద్దని భక్తులను టీటీడీ కోరింది. టీటీడీ అధికారిక వెట్సైట్లో భక్తులే నేరుగా టికెట్లు పొందాలని సూచించింది. స్వామి వారి దర్శనం టికెట్లు, సేవా టికెట్లతో వ్యాపారం చేసే దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.
తాజా వార్తలు
- భారత్ ఫస్ట్ స్లీపర్ AC కోచ్, 5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే!
- సర్ (SIR) ప్రక్రియ: ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక అడుగు
- యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- మచిలీపట్నం బస్స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ యోగాభ్యాసం
- ముంబై ఐఐటీ క్యాంపస్లో చిరుతపులి కలకలం
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన
- యూఏఈలో ఎండలు మండుతున్నాయి..49.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!
- అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!







