తిరుమలలో నకిలీ టికెట్ల కలకలం..
- August 23, 2024
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్ని జాగ్రత్తల చెప్పినా శ్రీవారి భక్తుల మోసాల బారిన పడుతూనే ఉన్నారు. భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు సొమ్ములు చేసుకుంటున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన నలుగురు భక్తుల మోసగాళ్ల బారిన పడ్డారు. నకిలీ టెకెట్లతో స్వామివారి కళ్యాణోత్సవానికి వచ్చిన వీరిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించడంతో ఈ మోసం వెలుగు చూసింది. ఇంటర్నెట్ నిర్వాహకుడి నుంచి శ్రీవారి కళ్యాణోత్సవం టికెట్లు కొనుగోలు చేసినట్టు భక్తులు తెలిపారు. దీంతో తమిళనాడు వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు అన్నాదురైపై పోలీసులకు విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు.
అన్నాదురై ఆన్లైన్లో నకిలీ వివరాలతో టికెట్లు తీసినట్టు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. పాస్పోర్టులోని చివరి నంబర్లను మార్చేసి శ్రీవారి కళ్యాణోత్సవం టికెట్లు బుక్ చేసినట్టు కనుగొన్నారు. ఈ టికెట్లను ఎక్కువ రేటుకు భక్తులకు విక్రయించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.
శ్రీవారి దర్శనం టికెట్లు, ఆర్జిత సేవ టికెట్లకు దళారీలను ఆశ్రయించద్దని భక్తులను టీటీడీ కోరింది. టీటీడీ అధికారిక వెట్సైట్లో భక్తులే నేరుగా టికెట్లు పొందాలని సూచించింది. స్వామి వారి దర్శనం టికెట్లు, సేవా టికెట్లతో వ్యాపారం చేసే దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం









