తిరుమలలో నకిలీ టికెట్ల కలకలం..
- August 23, 2024
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్ని జాగ్రత్తల చెప్పినా శ్రీవారి భక్తుల మోసాల బారిన పడుతూనే ఉన్నారు. భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు సొమ్ములు చేసుకుంటున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన నలుగురు భక్తుల మోసగాళ్ల బారిన పడ్డారు. నకిలీ టెకెట్లతో స్వామివారి కళ్యాణోత్సవానికి వచ్చిన వీరిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించడంతో ఈ మోసం వెలుగు చూసింది. ఇంటర్నెట్ నిర్వాహకుడి నుంచి శ్రీవారి కళ్యాణోత్సవం టికెట్లు కొనుగోలు చేసినట్టు భక్తులు తెలిపారు. దీంతో తమిళనాడు వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు అన్నాదురైపై పోలీసులకు విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు.
అన్నాదురై ఆన్లైన్లో నకిలీ వివరాలతో టికెట్లు తీసినట్టు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. పాస్పోర్టులోని చివరి నంబర్లను మార్చేసి శ్రీవారి కళ్యాణోత్సవం టికెట్లు బుక్ చేసినట్టు కనుగొన్నారు. ఈ టికెట్లను ఎక్కువ రేటుకు భక్తులకు విక్రయించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.
శ్రీవారి దర్శనం టికెట్లు, ఆర్జిత సేవ టికెట్లకు దళారీలను ఆశ్రయించద్దని భక్తులను టీటీడీ కోరింది. టీటీడీ అధికారిక వెట్సైట్లో భక్తులే నేరుగా టికెట్లు పొందాలని సూచించింది. స్వామి వారి దర్శనం టికెట్లు, సేవా టికెట్లతో వ్యాపారం చేసే దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









