భారత్ ఫస్ట్ స్లీపర్ AC కోచ్, 5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే!
- June 20, 2026
రాబోయే ముంబై-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలులోని ఫస్ట్ ఏసీ కోచ్ చూస్తే మీరు కూడా ఇదే అంటారు. అద్భుతమైన ఇంటీరియర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో కోచ్ ప్రైవేట్ క్యాబిన్, ప్రీమియం ఇంటీరయర్స్, అదిరిపోయే లైటింగ్, మోడ్రాన్ సౌకర్యాలు కనువిందు చేస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇకపై రైలు ప్రయాణం లగ్జరీగా ఉంటుంది.
అతి త్వరలో ముంబై, బెంగళూరుల మధ్య కొత్త ‘వందే భారత్ స్లీపర్’ రైలు నడవనుంది. ఇందులో ఫస్ట్ ఏసీ కోచ్కు సంబంధించిన ఫస్ట్ వీడియో బయటకు వచ్చింది. ఈ కోచ్ సౌకర్యాన్ని చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోతున్నారు. బాబోయ్.. ఇది లగ్జరీ హోటల్ లేదా ఫైవ్-స్టార్ హోటల్ గదినా అంటూ అబ్బరపోతున్నారు.
వైరల్ వీడియోను పరిశీలిస్తే.. ఈ రైలులో ఫస్ట్ ఏసీ కోచ్ లోపలి భాగం కనిపిస్తోంది. ఇందులో ప్రయాణికుల కోసం ప్రత్యేకమైన, ప్రైవేట్ క్యాబిన్లు ఉన్నాయి. ఈ కోచ్ అద్భుతమైన లైటింగ్, ప్రీమియం ఫినిషింగ్లు, చక్కగా అమర్చిన బెర్త్లతో పూర్తిగా మోడ్రాన్ లగ్జరీగా ఉంటుంది.
ప్రత్యేకించి ఈ ‘వందే భారత్ స్లీపర్’ను రాత్రి సమయాల్లో లాంగ్ జర్నీ చేసే ప్రయాణికుల కోసం రూపొందించారు. ప్రస్తుత వందే భారత్ రైళ్లలో ప్రధానంగా చైర్ కార్ సీట్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఈ కొత్త స్లీపర్ వెర్షన్ ప్రయాణికులకు నిద్రపోయేందుకు మంచి సౌకర్యాలు ఉన్నాయి. ఫస్ట్ ఏసీ కోచ్లలో క్యాబిన్లు సౌకర్యవంతంగా కనిపిస్తాయి.
స్పెషల్ ఫీచర్లు ఏంటి?
లగ్జరీ క్యాబిన్ సీట్లు: సౌకర్యవంతమైన నైట్ జర్నీల కోసం లగ్జరీ స్లీప్ ఏర్పాట్లు
హోటల్ తరహా టాయిలెట్లు: పాత, దుర్వాసనతో టాయిలెట్ల స్థానంలో ఇకపై క్లీన్ మోడ్రాన్
బయో-టాయిలెట్ల ఏర్పాటు
అత్యాధునిక భద్రత: ప్రయాణికుల భద్రత కోసం ప్రతి సందులోనూ సీసీటీవీ కెమెరాల ఏర్పాటు
డిజిటల్ డిస్ప్లే: ప్రయాణ సంబంధిత సమాచారమంతటా మోడ్రాన్ డిస్ప్లే స్క్రీన్
వ్యాపార, విహార యాత్రల నిమిత్తం ప్రతిరోజూ వేలాది మంది ముంబై, బెంగళూరుల మధ్య ప్రయాణిస్తుంటారు.ఈ రాత్రిపూట రైలు ప్రయాణికులకు సమయాన్ని ఆదా చేయడంతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ రైలు ప్రారంభ తేదీ ఇంకా ఖరారు కాలేదు.
తాజా వార్తలు
- భారత్ ఫస్ట్ స్లీపర్ AC కోచ్, 5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే!
- సర్ (SIR) ప్రక్రియ: ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక అడుగు
- యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- మచిలీపట్నం బస్స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ యోగాభ్యాసం
- ముంబై ఐఐటీ క్యాంపస్లో చిరుతపులి కలకలం
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన
- యూఏఈలో ఎండలు మండుతున్నాయి..49.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!
- అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!







