మచిలీపట్నం బస్స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- June 20, 2026
మచిలీపట్నం: మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి నేడు మచిలీపట్నం ఆర్టీసీ బస్స్టాండ్ను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.స్వల్ప వర్షానికే బస్స్టాండ్ ప్రాంగణం నీట మునిగిపోవడం, పారిశుధ్య లోపాలు, మౌలిక వసతుల కొరత కారణంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన ప్రత్యక్షంగా గమనించారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ను బస్స్టాండ్ ప్రస్తుత పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్న ఎంపీ, బస్స్టాండ్ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించి సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు.ఎంపీ నిధులు మరియు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల ద్వారా బస్స్టాండ్ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి బస్స్టాండ్ను దశలవారీగా అభివృద్ధి చేసి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం తన బాధ్యతగా భావిస్తున్నానని బాలశౌరి పేర్కొన్నారు. బస్స్టాండ్లో బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్, జనసేన పార్టీ నాయకులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భారత్ ఫస్ట్ స్లీపర్ AC కోచ్, 5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే!
- సర్ (SIR) ప్రక్రియ: ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక అడుగు
- యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- మచిలీపట్నం బస్స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ యోగాభ్యాసం
- ముంబై ఐఐటీ క్యాంపస్లో చిరుతపులి కలకలం
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన
- యూఏఈలో ఎండలు మండుతున్నాయి..49.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!
- అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!







