అమెరికాలో తెలుగు డాక్టర్ అనుమానస్పద మృతి...!
- August 25, 2024
* అమెరికాలో డాక్టర్ అనుమానస్పద మృతి
* అమెరికాలో పలు ఆసుపత్రులు నిర్మించి సేవలు అందిస్తున్న రమేశ్ బాబు..
* టస్కలూసా ప్రాంతంలో మంచి వైద్యులుగా గుర్తింపు
అమెరికా: అమెరికాలో తెలుగు డాక్టర్ అనుమానస్పదంగా మృతి చెందారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని మేనకూరుకు చెందిన పేరంశెట్టి రమేష్ బాబును (68) కొంతమంది దుండగులు కాల్చి చంపినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
వివరాల ప్రకారం... తిరుపతి ఎస్వి వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించిన ఆయన జమైకాలో ఎంఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలో వైద్యుడిగా స్థిరపడ్డాడు. ఆయనతోపాటు తన భార్య కూడా అక్కడే వైద్యురాలిగా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యులతో వారు అమెరికాలోనే స్థిరపడ్డారు.
ఇదిలా ఉండగా.... కరోనా సమయంలో రమేష్ బాబు విశేష సేవలను అందించారు. తన సేవలకు గాను ఆయన ఎన్నో పురస్కారాలను సైతం అందుకున్నారు. గతంలో తాను చదువుకున్నటువంటి పాఠశాలకు రూ. 14 లక్షలు విరాళం అందించారు. అలాగే స్వగ్రామంలో సాయిబాబా ఆలయ నిర్మాణానికి సైతం రూ. 20 లక్షలు అందించారు. ఇటీవల ఏపీకి వచ్చిన ఆయన తిరిగి అమెరికాకు వెళ్లిపోయారు. ఇంతలోనే ఇలా జరగడంతో వారి కుటుంబసభ్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









