అమెరికాలో తెలుగు డాక్టర్ అనుమానస్పద మృతి...!
- August 25, 2024
* అమెరికాలో డాక్టర్ అనుమానస్పద మృతి
* అమెరికాలో పలు ఆసుపత్రులు నిర్మించి సేవలు అందిస్తున్న రమేశ్ బాబు..
* టస్కలూసా ప్రాంతంలో మంచి వైద్యులుగా గుర్తింపు
అమెరికా: అమెరికాలో తెలుగు డాక్టర్ అనుమానస్పదంగా మృతి చెందారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని మేనకూరుకు చెందిన పేరంశెట్టి రమేష్ బాబును (68) కొంతమంది దుండగులు కాల్చి చంపినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
వివరాల ప్రకారం... తిరుపతి ఎస్వి వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించిన ఆయన జమైకాలో ఎంఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలో వైద్యుడిగా స్థిరపడ్డాడు. ఆయనతోపాటు తన భార్య కూడా అక్కడే వైద్యురాలిగా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యులతో వారు అమెరికాలోనే స్థిరపడ్డారు.
ఇదిలా ఉండగా.... కరోనా సమయంలో రమేష్ బాబు విశేష సేవలను అందించారు. తన సేవలకు గాను ఆయన ఎన్నో పురస్కారాలను సైతం అందుకున్నారు. గతంలో తాను చదువుకున్నటువంటి పాఠశాలకు రూ. 14 లక్షలు విరాళం అందించారు. అలాగే స్వగ్రామంలో సాయిబాబా ఆలయ నిర్మాణానికి సైతం రూ. 20 లక్షలు అందించారు. ఇటీవల ఏపీకి వచ్చిన ఆయన తిరిగి అమెరికాకు వెళ్లిపోయారు. ఇంతలోనే ఇలా జరగడంతో వారి కుటుంబసభ్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







