అమెరికాలో తెలుగు డాక్టర్ అనుమానస్పద మృతి...!
- August 25, 2024
* అమెరికాలో డాక్టర్ అనుమానస్పద మృతి
* అమెరికాలో పలు ఆసుపత్రులు నిర్మించి సేవలు అందిస్తున్న రమేశ్ బాబు..
* టస్కలూసా ప్రాంతంలో మంచి వైద్యులుగా గుర్తింపు
అమెరికా: అమెరికాలో తెలుగు డాక్టర్ అనుమానస్పదంగా మృతి చెందారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని మేనకూరుకు చెందిన పేరంశెట్టి రమేష్ బాబును (68) కొంతమంది దుండగులు కాల్చి చంపినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
వివరాల ప్రకారం... తిరుపతి ఎస్వి వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించిన ఆయన జమైకాలో ఎంఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలో వైద్యుడిగా స్థిరపడ్డాడు. ఆయనతోపాటు తన భార్య కూడా అక్కడే వైద్యురాలిగా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యులతో వారు అమెరికాలోనే స్థిరపడ్డారు.
ఇదిలా ఉండగా.... కరోనా సమయంలో రమేష్ బాబు విశేష సేవలను అందించారు. తన సేవలకు గాను ఆయన ఎన్నో పురస్కారాలను సైతం అందుకున్నారు. గతంలో తాను చదువుకున్నటువంటి పాఠశాలకు రూ. 14 లక్షలు విరాళం అందించారు. అలాగే స్వగ్రామంలో సాయిబాబా ఆలయ నిర్మాణానికి సైతం రూ. 20 లక్షలు అందించారు. ఇటీవల ఏపీకి వచ్చిన ఆయన తిరిగి అమెరికాకు వెళ్లిపోయారు. ఇంతలోనే ఇలా జరగడంతో వారి కుటుంబసభ్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









