అర్చకులకు సీఎం చంద్రబాబు శుభవార్త..!
- August 28, 2024
అమరావతి: అర్చకులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. అర్చకుల వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వారి వేతనాన్ని రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంచాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తాన్ని రూ.5వేల నుంచి రూ.10వేల పెంచాలన్నారు చంద్రబాబు. నిరుద్యోగ వేద విద్యార్థులకు నెలకు రూ.3వేలు భృతి ఇవ్వాలన్నారు. నాయీ బ్రాహ్మణులకు కనీసం వేతనం రూ.25వేలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ మంత్రి, అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
బలవంతపు మత మార్పిడులు ఆగాలి, ఆలయాల్లో అపచారాలకు చోటు ఉండకూడదు- సీఎం చంద్రబాబు. దేవాలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరియాలి. అపచారాలకు చోటు ఉండకూడదు. బలవంతపు మత మార్పిడులు ఆగాలి. అన్యమతస్థులు రాకూడదు. భక్తుల మనోభావాలకు, ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. టెంపుల్ టూరిజం (ఆధ్యాత్మిక పర్యాటకాభివృద్ధి) ప్రమోషన్ కోసం మూడు శాఖల మంత్రులతో(దేవాదాయ, అటవీ, పర్యాటక శాఖ) కమిటీ. దేవాలయాల ట్రస్ట్ బోర్డుల్లో అదనంగా మరో ఇద్దరికి అవకాశం. అర్చకుల వేతనం రూ.10వేల నుంచి రూ. 15వేలకు పెంపు.
ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు. నిరుద్యోగ వేద విద్యార్థులకు నెలకు రూ.3 వేలు భృతి. నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం రూ.25 వేలు ఉండేలా చర్యలు. దేవాలయ ఆస్తుల పరిరక్షణకు కమిటీ ఏర్పాటు. దేవాలయాల్లో పరిశుభ్రత, ప్రసాదంలో నాణ్యత, ప్రశాంత వాతావరణం కనిపించేలా చర్యలు తీసుకోవాలి” అని దేవాదాయ శాఖపై సమీక్షలో అధికారులతో చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు