బెంగాల్ పరువుతీయడమే బీజేపీ లక్ష్యం: సీఎం మమతా బెనర్జీ
- August 28, 2024
కోల్ కతా: పశ్చిమ బెంగాల్లో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బెంగాల్ రాజకీయాల్లోనూ ప్రకంపనలకు దారి తీసింది.
ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని నబన్నా అభియాన్ ర్యాలీ జరిగింది. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ ఛాత్ర పరిషద్ (విద్యార్థి విభాగం) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బహిరంగ కార్యక్రమంలో సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బెంగాల్ పరువు తీయడమే బీజేపీ బంద్ లక్ష్యమని అన్నారు. వైద్యురాలి హత్యాచారం కేసును తప్పుదారి పట్టించేందుకు కుట్రచేస్తున్నారని ఆరోపించారు. బంద్ కు తాము మద్దతివ్వడం లేదన్నారు. రేప్ కేసుల్లో ఉరిశిక్షే సరైందన్నారు. వచ్చేవారం సమావేశాలు ఏర్పాటు చేసి రేపిస్టులకు కఠిన శిక్ష పడేలా అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తామన్నారు. గవర్నర్ దానిని ఆమోదించకుంటే రాజ్భవన్ ఎదుట బైఠాయిస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









