అమెరికాలో ఏపీ విద్యార్థి మృతి..
- August 29, 2024
అమెరికా: శ్రీకాకుళం(D) ఇచ్ఛాపురానికి చెందిన రూపక్ రెడ్డి(26) అమెరికాలో మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంనకు చెందిన పి రూపక్రెడ్డి ఎమ్మెస్ కోసం 8 నెలల క్రితం అమెరికా వెళ్లారు. డెలవేర్లో ఉంటూ హరిస్ బర్గ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎమ్మెస్ చేస్తున్నారు.
రూపక్ మంగళవారం సాయంత్రం తన స్నేహితులు ఐదుగురితో కలసి ఓ సరస్సులో బోటింగ్ కోసం వెళ్లారు. అయితే రూపక్ సరస్సు మధ్యలో ఉన్న రాయిపైకి ఎక్కి ఫొటోలు తీసుకుంటుండగా.. అతడితో పాటు స్నేహితుడు రాజీవ్ సరస్సులోకి జారిపడ్డారు. వెంటనే అప్రమత్తం అయిన మిగిలిన స్నేహితులు రాజీవ్ను రక్షించినా, రూపక్ను మాత్రం కాపాడలేకపోయారు. ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడి పోలీసులకు ఫోన్లో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత రెస్క్యూ టీమ్ గాలించగా రూపక్ రెడ్డి మృతదేహం లభించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









