అమెరికాలో ఏపీ విద్యార్థి మృతి..
- August 29, 2024
అమెరికా: శ్రీకాకుళం(D) ఇచ్ఛాపురానికి చెందిన రూపక్ రెడ్డి(26) అమెరికాలో మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంనకు చెందిన పి రూపక్రెడ్డి ఎమ్మెస్ కోసం 8 నెలల క్రితం అమెరికా వెళ్లారు. డెలవేర్లో ఉంటూ హరిస్ బర్గ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎమ్మెస్ చేస్తున్నారు.
రూపక్ మంగళవారం సాయంత్రం తన స్నేహితులు ఐదుగురితో కలసి ఓ సరస్సులో బోటింగ్ కోసం వెళ్లారు. అయితే రూపక్ సరస్సు మధ్యలో ఉన్న రాయిపైకి ఎక్కి ఫొటోలు తీసుకుంటుండగా.. అతడితో పాటు స్నేహితుడు రాజీవ్ సరస్సులోకి జారిపడ్డారు. వెంటనే అప్రమత్తం అయిన మిగిలిన స్నేహితులు రాజీవ్ను రక్షించినా, రూపక్ను మాత్రం కాపాడలేకపోయారు. ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడి పోలీసులకు ఫోన్లో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత రెస్క్యూ టీమ్ గాలించగా రూపక్ రెడ్డి మృతదేహం లభించింది.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!