వచ్చే నెల 8న భారత్కు వెళ్లనున్న అబుధాబి క్రౌన్ ప్రిన్స్
- August 29, 2024
అబుధాబి: అబుధాబి క్రౌన్ ప్రిన్స్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వచ్చే నెలలో భారత్లో పర్యటించనున్నారు.యూఏఈ తదుపరి నాయకత్వం కోసం నహ్యాన్ పోటీదారుగా ఉన్నారు. తన పర్యటనలో భాగంగా భారతదేశం యూఏఈ మధ్య వాణిజ్యం, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చల కోసం భారత్కు వస్తున్నట్లు తెలుస్తోంది.
షేక్ ఖలీద్ సెప్టెంబర్ 8న భారత్కు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ పర్యటన పై ఇంతవరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.తన పర్యటనలో అబుధాబి క్రౌన్ ప్రిన్స్ ప్రధాని నరేంద్ర మోడీని, దేశ అగ్ర నాయకత్వాన్ని కలుస్తారని తెలుస్తోంది.ఈ పర్యటన రాబోయే దశాబ్దాలలో భవిష్యత్ సంబంధాలను మరింతగా పెంచుకోవడం పై దృష్టి సారించనున్నది.
‘భారత్, యూఏఈ మధ్య సంబంధాలు ఇప్పుడు చాలా బలంగా ఉన్నాయి.ఈ పర్యటనలో ఆ పునాదిని మరింత బలోపేతం చేయడం, రాబోయే దశాబ్దాల కోసం ఎదురుచూడడం, యూఏఈ భవిష్యత్ నాయకత్వంతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడం పై దృష్టి సారించనున్నట్లు-అబుధాబి అధికారి ఒకరు తెలిపారు.
తాజా వార్తలు
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!