ఐదుగురు మంత్రులతో నూతన మద్యం విధానం: ముఖేష్ కుమార్ మీనా
- August 29, 2024
విజయవాడ: ఏపీ రాష్ట్రంలో నూతన మద్యం విధానం రూపకల్పనకు మంత్రివర్గ ఉప సంఘంను నియమిస్తూ ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేసారు. ఐదుగురు మంత్రులతో కూడిన సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవిలను నియమించారు. ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీని ఈ మంత్రివర్గ ఉప సంఘం సమీక్షించనుంది.
వివిధ రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీలు, మద్యం దుకాణాలు, బార్లు, బెవరేజెస్ కంపెనీలు వంటి వాటిల్లో వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను పరిశీలించనుంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసి ఇచ్చిన అధికారుల నివేదికను పరిశీలించనుంది. మద్యం విధాన రూపకల్పనలో భాగంగా వివిధ వర్గాల నుంచి మంత్రి వర్గ సబ్ కమిటీ అభిప్రాయాలు సేకరించనుందని మీనా ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. అత్యంత ఉత్తమమైన మద్యం పాలసీని తీసుకు రావాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఈ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









