మెగా వెర్సస్ అల్లు.! రచ్చకి అలా చెక్ పడేనా.?
- August 30, 2024
బాలకృష్ణ సినిమాల్లోకి వచ్చి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1 న జరిగబోయే ఈ ప్రత్యేక కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిధిగా ఆహ్వానించడం జరిగింది.
అలాగే, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడకకు హాజరు కానున్నారని సమాచారం. వీరిద్దరితో పాటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి కూడా ఈ వేడుకకు ఆహ్వానం అందింది.
ఈ మధ్య మెగా వెర్సస్ అల్లు.. అంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న రచ్చ సంగతి తెలిసిందే. నిజంగానే ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేకపోయినా ఇదిగో పుట్టింది.. అంటే అదిగో పెరిగింది అన్న చందంగా ఏ చిన్న చిచ్చు రేగినా రోడ్డుకీడ్చేస్తుంటారు సోషల్ ప్రబుధ్దులు వీరి విషయంలో.
ఈ నేపథ్యంలోనే ఈ మధ్య వాంటెడ్లీ చేసినా.. అన్వాంటెడ్లీ చేసినా.. అల్లు అర్జున్ చేసిన కొన్ని పిచ్చి పనులు, నోటి దురద వేషాల కారణంగా మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ మధ్య చిచ్చు చెలరేగింది.
దాంతో, పుట్టు పూర్వోత్తరాలన్నీ తవ్వి తీస్తూ న్యూసెన్స్ చేస్తున్నారు నెట్టింట. ఈ నేపథ్యంలో.. తాజాగా బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ ఈ చిచ్చును స్విచ్చాప్ చేస్తుందనుకుంటున్నారు.
ఒకే వేదికపై అటు చిరంజీవి, ఇటు పవన్ కళ్యాణ్ మధ్యలో అల్లు అర్జున్.. చూసి రెండు వర్గాల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవ్వడం ఖాయం.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









