మెగా వెర్సస్ అల్లు.! రచ్చకి అలా చెక్ పడేనా.?
- August 30, 2024
బాలకృష్ణ సినిమాల్లోకి వచ్చి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1 న జరిగబోయే ఈ ప్రత్యేక కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిధిగా ఆహ్వానించడం జరిగింది.
అలాగే, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడకకు హాజరు కానున్నారని సమాచారం. వీరిద్దరితో పాటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి కూడా ఈ వేడుకకు ఆహ్వానం అందింది.
ఈ మధ్య మెగా వెర్సస్ అల్లు.. అంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న రచ్చ సంగతి తెలిసిందే. నిజంగానే ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేకపోయినా ఇదిగో పుట్టింది.. అంటే అదిగో పెరిగింది అన్న చందంగా ఏ చిన్న చిచ్చు రేగినా రోడ్డుకీడ్చేస్తుంటారు సోషల్ ప్రబుధ్దులు వీరి విషయంలో.
ఈ నేపథ్యంలోనే ఈ మధ్య వాంటెడ్లీ చేసినా.. అన్వాంటెడ్లీ చేసినా.. అల్లు అర్జున్ చేసిన కొన్ని పిచ్చి పనులు, నోటి దురద వేషాల కారణంగా మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ మధ్య చిచ్చు చెలరేగింది.
దాంతో, పుట్టు పూర్వోత్తరాలన్నీ తవ్వి తీస్తూ న్యూసెన్స్ చేస్తున్నారు నెట్టింట. ఈ నేపథ్యంలో.. తాజాగా బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ ఈ చిచ్చును స్విచ్చాప్ చేస్తుందనుకుంటున్నారు.
ఒకే వేదికపై అటు చిరంజీవి, ఇటు పవన్ కళ్యాణ్ మధ్యలో అల్లు అర్జున్.. చూసి రెండు వర్గాల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవ్వడం ఖాయం.
తాజా వార్తలు
- తెలంగాణ: ఎబోలా కలకలం..విదేశీ ప్రయాణికుల పై ప్రభుత్వం ప్రత్యేక నిఘా!
- మంత్రి లోకేష్ను ముట్టడించిన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు!
- షార్జాలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..నవజాత శిశువుతోపాటు ఫ్యామిలీ సేఫ్..!!
- మే నెలలో 4వెలకు పైగా తనిఖీ పర్యటనలు నిర్వహించిన LMRA..!!
- మిడ్ డే ఔట్ డోర్ వర్క్ వయలేషన్స్..జరిమానాల పై PAM హెచ్చరిక..!!
- భారతీయ సిబ్బందిని రక్షించిన ఒమన్..కృతజ్ఞతలు తెలిపిన భారత్..!!
- నిబంధనలు ఉల్లంఘించిన 1,753 ఆహార సంస్థలకు ఎస్ఎఫ్డీఏ జరిమానా..!!
- జూన్లో సౌక్ వాకిఫ్లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్..!!
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్









