మెగా వెర్సస్ అల్లు.! రచ్చకి అలా చెక్ పడేనా.?
- August 30, 2024
బాలకృష్ణ సినిమాల్లోకి వచ్చి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1 న జరిగబోయే ఈ ప్రత్యేక కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిధిగా ఆహ్వానించడం జరిగింది.
అలాగే, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడకకు హాజరు కానున్నారని సమాచారం. వీరిద్దరితో పాటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి కూడా ఈ వేడుకకు ఆహ్వానం అందింది.
ఈ మధ్య మెగా వెర్సస్ అల్లు.. అంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న రచ్చ సంగతి తెలిసిందే. నిజంగానే ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేకపోయినా ఇదిగో పుట్టింది.. అంటే అదిగో పెరిగింది అన్న చందంగా ఏ చిన్న చిచ్చు రేగినా రోడ్డుకీడ్చేస్తుంటారు సోషల్ ప్రబుధ్దులు వీరి విషయంలో.
ఈ నేపథ్యంలోనే ఈ మధ్య వాంటెడ్లీ చేసినా.. అన్వాంటెడ్లీ చేసినా.. అల్లు అర్జున్ చేసిన కొన్ని పిచ్చి పనులు, నోటి దురద వేషాల కారణంగా మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ మధ్య చిచ్చు చెలరేగింది.
దాంతో, పుట్టు పూర్వోత్తరాలన్నీ తవ్వి తీస్తూ న్యూసెన్స్ చేస్తున్నారు నెట్టింట. ఈ నేపథ్యంలో.. తాజాగా బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ ఈ చిచ్చును స్విచ్చాప్ చేస్తుందనుకుంటున్నారు.
ఒకే వేదికపై అటు చిరంజీవి, ఇటు పవన్ కళ్యాణ్ మధ్యలో అల్లు అర్జున్.. చూసి రెండు వర్గాల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవ్వడం ఖాయం.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







