600 దిర్హామ్‌ల కోసం ప్రవాసిపై దాడి..7 మందిని అరెస్టు

- August 31, 2024 , by Maagulf
600 దిర్హామ్‌ల కోసం ప్రవాసిపై దాడి..7 మందిని అరెస్టు

యూఏఈ: బుధవారం ఎమిరేట్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన ఘర్షణలో షార్జా నివాసి మరణించినట్లు అధికారులు తెలిపారు. 600 దిర్హామ్‌ల అప్పు విషయంలో గొడవ ప్రారంభమైనట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ముగ్గురు తోబుట్టువులను కర్రలు, కత్తులతో కొట్టినందుకు ఏడుగురు ఆసియా ప్రవాసులను అరెస్టు చేసినట్లు షార్జా పోలీసులు తెలిపారు. ఈ సంఘటన తీవ్ర వాగ్వాదంతో ప్రారంభమైందని, అనంతరం ఇది భౌతిక దాడికి దారితీసింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.

అయితే, సంఘటన జరిగిన వెంటనే షార్జా పోలీసులు దాడి చేసిన వారిని గుర్తించి, ట్రాక్ చేయగలిగారు. రెండు గంటల్లోనే వారిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఆర్థిక పరమైన వివాదం కారణంగా బాధితులపై దాడి చేసినట్లు ఏడుగురు వ్యక్తులు అంగీకరించారు. వివాదాలు వచ్చినప్పుడు చట్టపరమైన విధానాలను ఎల్లప్పుడూ అనుసరించాలని షార్జా పోలీసులు నివాసితులను కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com