3 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ..
- August 31, 2024
న్యూ ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలో మరో మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. లక్నో- మీరఠ్, మధురై-బెంగళూరు, చెన్నై-నాగర్కోయిల్ మధ్య ఈ వందేభారత్ రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లను మోదీ వర్చువల్గా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవానికి దక్షిణాది రాష్ట్రాలు వేగంగా వృద్ధి చెందడం కీలకమని ప్రధాని మోదీ చెప్పారు.
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు పెంచిన బడ్జెట్ కేటాయింపుల వల్ల దక్షిణాదిలో రైలు రవాణా మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. వందేభారత్ రైలు వల్ల మీరఠ్- లక్నో మధ్య ప్రయాణ సమయం దాదాపు గంట మేర ఆదా అవుతుందని తెలిపారు.
మిగతా రైళ్ల వల్ల కూడా సమయం ఆదా అవుతుందని చెప్పారు.ఎన్నో ఏళ్లుగా నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపడంలో భారతీయ రైల్వే ఎంతో పురోగతి సాధించిందని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల వారికీ సౌకర్యవంతమైన ప్రయాణం అందించడమే రైల్వే లక్ష్యమని చెప్పారు.
తాజా వార్తలు
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!









