స్లీపర్ ట్రైన్ ప్రోటోటైప్ వెర్షన్ ఆవిష్కరణ...
- September 01, 2024
న్యూ ఢిల్లీ: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు (ఆదివారం) వందే భారత్ స్లీపర్ కోచ్ ప్రొటోటైప్ వెర్షన్ను ఆవిష్కరించారు. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) ఫెసిలిటీలో వీటిని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…వందేభారత్ చైర్ కార్ విజయం తర్వాత….వందే భారత్ స్లీపర్ కోచ్ల కోసం చాలా శ్రమించామన్నారు.కొత్త రైలు రూపకల్పన చాలా క్లిష్టమైన పని అని, వందే భారత్ స్లీపర్ కార్లలో అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు.
వీటి తయారీ ఇప్పుడే పూర్తయిందని, పది రోజుల పాటు కఠిన పరీక్షలు, ట్రయల్ రన్స్ నిర్వహిస్తామని వైష్ణవ్ తెలిపారు.రానున్న మూడు నెలల్లో వందే భారత్ స్లీపర్ కోచ్ సేవలను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.వందే భారత్లో నాసిరకం ఆహార పదార్థాల ఫిర్యాదుల పై మంత్రి మాట్లాడుతూ, భారతీయ రైల్వే రోజుకు 13 లక్షల భోజనాన్ని అందిస్తోందని, ఫిర్యాదులు 0.01 కంటే తక్కువగా ఉన్నాయని చెప్పారు.
అయితే ఇప్పటికే అందిన ఫిర్యాదులపై చాలా ఆందోళన చెందుతున్నామని… సంబంధిత క్యాటరర్లు, సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.కాగా, బీఈఎంఎల్ ఆవరణలో ఏర్పాటు చేసిన వందేభారత్ తయారీ కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు. బీఈఎంఎల్ కాంప్లెక్స్ సమీపంలో 9.2 ఎకరాల విస్తీర్ణంలో కొత్త హ్యాంగర్ సదుపాయానికి వైష్ణవ్ శంకుస్థాపన చేశారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









