ఘనంగా బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుక.!
- September 02, 2024
నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాల్లోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు అభిమానులు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కార్యక్రమానికి బాలయ్య, మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
లేటెస్ట్గా జరిగిన ఈ వేడకకు చిరంజీవి గెస్ట్గా రావడంతో పాటూ, విక్టరీ వెంకటేష్ కూడా విచ్చేశారు. అయితే, ఈ వేడుకకు అల్లు అర్జున్ కూడా విచ్చేయనున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ, అల్లు అర్జున్ హాజరు కాలేదు.
అలాగే ఎన్టీయార్ కూడా ఈ వేడకలో కనిపించకపోవడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓవరాల్గా చూస్తే ఈ జనరేష్ హీరోలెవ్వరూ ఈ వేడకకు హాజరు కాలేదు. కాగా, ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, బాలయ్యనుద్దేశించి చేసిన స్పీచ్ అద్భుతంగా వుందని మాట్లాడుకుంటున్నారు.
అలాగే, మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, వెంకటేష్.. ఇలా ముగ్గురు సీనియర్ హీరోలు ఒకే వేదికపై కనిపించడం అభిమానులకు పండగలా అనిపిస్తోంది.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!