ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు మోర్సీకి 40 ఏండ్ల జైలుశిక్ష
- June 18, 2016
ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు మహ్మద్ మోర్సీకి ఆ దేశ న్యాయస్థానం 40 ఏండ్ల జైలుశిక్ష విధించింది. కతర్కు దేశ రహస్యాలు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై మోర్సీకి న్యాయస్థానం శనివారం ఈ శిక్ష విధించింది. ఇదే కేసులో ముస్లిం బ్రదర్హుడ్కు చెందిన ఆరుగురు సభ్యులకు ఉరిశిక్ష, మరో ఇద్దరికి 25 ఏండ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. మోర్సీకి అదనంగా 15 ఏండ్ల జైలుశిక్ష విధించింది. మోర్సీ సహా ఆరుగురు అతడి బ్రదర్హుడ్ అనుచరులకు విధించిన తీర్పును న్యాయస్థానం గతనెలలో గ్రాండ్ ముఫ్తీకి సిఫారసుచేసింది. ఈజిప్ట్ చట్టాల ప్రకారం న్యాయస్థానం విధించిన ఉరిశిక్షను గ్రాండ్ ముఫ్తీ ఆమోదించాలి. గ్రాండ్ ముఫ్తీ నిర్ణయంతో సంబంధం లేకుండా దోషులకు న్యాయస్థానం శిక్షలు ఖరారుచేసింది.
వీరిలో డాక్యుమెంటరీ సినిమా నిర్మాత అహ్మద్ అబ్దో అలీఅఫీఫీ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. రాస్ద్ న్యూస్నెట్వర్క్ విలేకరి అస్మాయెల్ ఖాతీబ్, ఆల్ జజీరాలో న్యూస్ ప్రోడ్యూసర్ అయిన జోర్డాన్ పౌరుడు అలాఒమర్ మహ్మద్, ఆల్ అజీరా న్యూస్ ఎడిటర్ ఇబ్రహిం మహ్మద్ హిలాల్ కోర్టు విచారణకు గైర్హాజరయ్యారు.
తాజా వార్తలు
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!









