దుబాయ్ లో పాఠశాలల్లో తనిఖీలు.. మూడు స్కూల్స్ మూసివేత..!
- September 04, 2024
దుబాయ్: నాణ్యతా ప్రమాణాలను పాటించనందున 2023-2024 విద్యా సంవత్సరంలో మూడు దుబాయ్ పాఠశాలలు మూసివేసినట్టు దుబాయ్లోని ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ వెల్లడించింది. ‘మీట్ ది సీఈఓ’ కార్యక్రమంలో నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (KHDA) ఈ సమాచారాన్ని షేర్ చేసింది.
అయితే, దుబాయ్లోని ప్రైవేట్ పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో తనిఖీలు చేయబోమని ప్రకటించింది. కానీ పాఠశాలలు పూర్తి తనిఖీ కోసం దుబాయ్ స్కూల్స్ ఇన్స్పెక్షన్ బ్యూరో (DSIB)కి ఫిర్యాదు అందితే.. అథారిటీ నిబంధనలకు లోబడి తనిఖీలు నిర్వహిస్తారు. KHDA డైరెక్టర్ జనరల్ ఐషా మిరాన్ మాట్లాడుతూ.. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సన్నాహాలు జనవరిలో ప్రారంభమయ్యాయని, 50కి పైగా సెషన్లు ఉన్నాయని, 700 కంటే ఎక్కువ మంది వ్యక్తులు, 290 విద్యాసంస్థలు తల్లిదండ్రులు, అధ్యాపకుల నుండి అభిప్రాయాన్ని సేకరించనున్నారు. దుబాయ్లో ప్రస్తుతం 223 ప్రైవేట్ పాఠశాలలలో 365,000 మంది విద్యార్థులు చదువుతున్నారు.
తాజా వార్తలు
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!







